AB Vajpayee: 10వేల ఎకరాల్లో వాజ్పేయీ స్మృతివనం!
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ మెమోరియల్ను ఆయన స్వస్థలం గ్వాలియర్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 4050 హెక్టార్ల స్థలాన్ని అక్కడి పాలనా విభాగం కేటాయించింది.
గ్వాలియర్: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ (AB Vajpayee ) జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాజ్పేయీ స్వస్థలంలో భారీ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం గ్వాలియర్లో సుమారు 10వేల ఎకరాల (4,050 హెక్టార్ల) భూమిని కేటాయించింది. ఈ విషయాన్ని వాజ్పేయీ పుట్టిన రోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కడి అధికారులు వెల్లడించారు.
గ్వాలియర్లో (Gwalior) అటల్ బిహారీ వాజ్పేయీ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ ఇదివరకే ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం సిరోల్ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రతిపాదనను మున్సిపల్, ఇతర విభాగాలు పరిశీలించాయి. ఆయా విభాగాల అనుమతి తర్వాత డివిజన్ స్థాయిలోని నజూల్ కమిటీ (Nazool Committee) ఇందుకు ఆమోదం తెలిపింది. అయితే, గతేడాది వాజ్పేయీ వర్ధంతిని పురస్కరించుకొని.. గ్వాలియర్లో భారీ స్థాయిలో ఆయన స్మారకాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే దీనికి అవసరమైన స్థలానికి స్థానిక పాలనా విభాగం నుంచి ఆమోదం లభించింది.
భాజపా అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ 1924, డిసెంబర్ 24న గ్వాలియర్లో జన్మించారు. దేశవ్యాప్తంగా భాజపాను బలోపేతం చేయడంతోపాటు 1990, 2000ల్లో కేంద్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక కృషి చేశారు. మొత్తంగా ఆరేళ్ల పాటు ప్రధానమంత్రి వాజ్పేయీ బాధ్యతలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్