MS Swaminathan: దేశ ‘వ్యవసాయం తలరాత’నే మార్చి.. 84 డాక్టరేట్లు పొంది!
వ్యవసాయం లాభసాటిగా మారాల్సి ఉందని.. అప్పుడే యువరైతులు ఈ రంగంలో కొనసాగడం, కొత్తవారు ఆకర్షితులవడం జరుగుతుందని ఎంఎస్ స్వామినాథన్ చెబుతుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త (Agriculture Scientist).. అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టికర్త. ప్రజలు పస్తులుండే దుస్థితి పోవాలని పరితపించిన వ్యక్తి. రైతులకు గిట్టుబాటు ధర మొదలు (MSP).. వ్యవసాయంలో అధిక దిగుబడులు, మార్కెట్లో సంస్కరణలకు నిరంతరం కృషిచేసిన హరిత విప్లవ (Green Revolution) పితామహుడు. వ్యవసాయ స్వయంసమృద్ధికి నిరంతరం కృషి చేస్తూ.. దేశ వ్యవసాయ పద్ధతుల ముఖచిత్రాన్నే మార్చిన కర్షక పక్షపాతి. కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి దశాదిశను చూపిన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ (MS Swaminathan) ప్రస్థానంలోకి ఓసారి తొంగిచూస్తే..
హరిత విప్లవ పితామహుడు..
వ్యవసాయం ఆర్థికంగా లాభసాటిగా మారాల్సి ఉందని పరితపించిన ఎంఎస్ స్వామినాథన్.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుంటుందని విశ్వసించారు. ఆధునిక పద్ధతులతో అధిక ఫలసాయం సాధ్యమని నమ్మిన ఆయన.. కొత్త వంగడాలు సృష్టించి దేశంలో వ్యవసాయం గతిని మార్చారు. రెండోప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభ పరిస్థితులు, బెంగాల్ కరువు ప్రజలకు శాపంగా మారింది. అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాల అభివృద్దే లక్ష్యంగా మెక్సికోలో తొలుత హరిత విప్లవానికి బీజం పడింది.
ఇలా 1960, 70దశకంలో భారత్లోనూ ఆహార సంక్షోభం (Food Crisis) ముప్పును ఎదుర్కొన్న సమయంలో భిన్న వ్యవసాయ పరిస్థితులను ఎదుర్కొని అధిక దిగుబడులిచ్చే పంటల అవసరం ఏర్పడింది. అప్పటికే వ్యవసాయంలో కీలక పరిశోధనలు చేస్తున్న ఎంఎస్ స్వామినాథన్.. అధిక దిగుబడులు ఇచ్చే గోధుమ, వరి రకాలను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు. ఆయన చేసిన కృషి.. వాటిని ఇక్కడ అమలు చేయడం భారత్లో హరిత విప్లవానికి నాంది పలికింది. అనంతరం అది భారత వ్యవసాయ పద్ధతుల ముఖచిత్రాన్నే మార్చివేసింది. దేశ వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు దోహదం చేయడంతోపాటు కోట్ల మందికి ఆహార భద్రతను (Food Security) కల్పించింది.
గిట్టుబాటు ఫార్ములా..
దేశంలో ‘స్వామినాథన్ కమిషన్’ సిఫార్సులను అమలు చేయాలనే వాదన ఎంతో కాలంగా ఉంది. రైతులకు మద్దతు ధర కోసం వ్యవసాయ పరిశోధకుడు స్వామినాథన్ నేతృత్వంలో ఓ ఫార్ములాను (MSP formula) రూపొందించారు. రైతుల పంట ఉత్పత్తి వ్యయంపై కనీసం 150శాతం (C2 plus 50%) దక్కేలా ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించాలనేది దీని ఉద్దేశం. రైతులు చెల్లించేసిన వ్యయాలు, కుటుంబ శ్రమ విలువ, సొంత మూలధన ఆస్తుల విలువపై వడ్డీ, భూమికి చెల్లించిన కౌలు, సొంత భూమికి కౌలు విలువ వంటి వ్యయాలన్నీ జతచేర్చి C2గా వ్యవహరించారు. వీటికి అదనంగా 50శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలనేది ఈ ఫార్ములా (MSP formula) లక్ష్యం. రైతుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఎన్సీఎఫ్ (NCF) సిఫార్సులే తగినవని ఎంఎస్ స్వామినాథన్ చివరి శ్వాస వరకు ఉద్ఘాటించారు.
84 గౌరవ డాక్టరేట్లు..
భారత వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చూపిన ప్రభావం దేశ సరిహద్దులు దాటింది. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్తోపాటు అనేక వ్యవసాయ ఆధారిత అంతర్జాతీయ కేంద్రాలకు అధిపతిగా పని చేసిన ఆయన.. వ్యవసాయంతోపాటు పర్యావరణ సమస్యలపైనా దృష్టి సారించారు. 1960, 70ల్లో భారత వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు కృషి చేసిన ఆయన్ను ఐరాస పర్యావరణ కార్యక్రమం (UNEP) ‘ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ఎకాలజీ’గా పేర్కొంది. ఇలా ఆయన పరిశోధనల ప్రస్థానంలో 18 పుస్తకాలు, 250 పరిశోధక పేపర్లను (2021 వరకు) రచించారు. ప్రపంచ వ్యవసాయ రంగంపై ఆయన చూపిన ప్రభావానికి గాను ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులతోపాటు దాదాపు 84 డాక్టరేట్లు ఆయన్ను వరించాయంటే స్వామినాథన్ ఘనతను అర్థం చేసుకోవచ్చు. ఇలా ‘టైమ్స్’ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతుల్లో టాప్ 20లోనూ ఆయన నిలిచారు.
ప్రోత్సాహం ఇస్తేనే..
వ్యవసాయం లాభసాటిగా మారాల్సి ఉందని.. అప్పుడే యువరైతులు ఈ రంగంలో కొనసాగడం, కొత్తవారు ఆకర్షితులవడం జరుగుతుందని ఎంఎస్ స్వామినాథన్ చెబుతుంటారు. వ్యవసాయ విధానాల రూపకల్పన ప్రక్రియలో రైతులు, విధానకర్తల మధ్య తగినంత చర్చ జరగడం లేదన్నది ఆయన అభిప్రాయం. ఇలాంటి చర్యలన్నీ మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కోరుకున్నారు. రైతులకు ఆదాయం సుస్థిరత దక్కేలా చూడటం ముఖ్యమని భావించేవారు. ఇందుకోసం రైతు అనుకూల మార్కెట్ విధానం అవసరమనేవారు. రైతుల బాగోగుల్ని నిర్ణయించేవి రుతుపవనాలు, మార్కెట్లేనని డాక్టర్ స్వామినాథన్ బలంగా విశ్వసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
PM Modi: భారత్లో కాప్-33 సదస్సు.. దుబాయ్లో ప్రతిపాదించిన మోదీ
PM Modi: మరో ఐదేళ్ల తర్వాత ప్రపంచ వాతావరణ సదస్సును భారత్లో నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
Electricity bill: రూ.4,950 బిల్లుకు.. రూ.197 కోట్ల రసీదు
ఓ మహిళ రూ.4,950 విద్యుత్ బిల్లు చెల్లించగా.. ఆమెకు సిబ్బంది రూ.197 కోట్లు చెల్లించినట్లు రసీదు ఇచ్చారు. -
Supreme Court: సీఎంతో సమావేశమై సమస్యకు తెరదించండి.. తమిళనాడు గవర్నర్కు ‘సుప్రీం’ సూచన
బిల్లుల ఆమోద సమస్య పరిష్కారానికిగానూ సీఎం ఎంకే స్టాలిన్తో సమావేశం నిర్వహించాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని సుప్రీం కోర్టు కోరింది. -
CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు
10, 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో మార్కులకు సంబంధించి ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్ (Distinction) తాము కేటాయించమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టం చేసింది. -
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు (Bengaluru)లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు విడతలుగా ఈ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. -
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
సరిహద్దులు సురక్షితంగా లేకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. -
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏడాది క్రితం చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని జీవిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
శ్రీనగర్ నిట్లో సోషల్ మీడియా దుమారం
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ ఎన్ఐటీలో మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుకు నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. -
పల్లెటూరి మేడం యూట్యూబ్ ఆంగ్ల పాఠాలు అదుర్స్
ఉత్తర్ప్రదేశ్లోని కౌశాంబీ జిల్లా సిరాథూ నగర పంచాయతీకి చెందిన యశోద అనే గ్రామీణ యువతి ఆంగ్ల బోధనకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి విశేష ఆదరణ చూరగొంటోంది. -
Gated community: గేటెడ్ కమ్యూనిటీ రోడ్లపై ఎవరైనా వెళ్లవచ్చు!
గేటెడ్ కమ్యూనిటీల్లోని రహదారులపై బయటి వారు కూడా రాకపోకలు సాగించవచ్చని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
సిల్క్యారాలోనా.. సొంత ఊళ్లకా!
మృత్యువు అంచువరకు వెళ్లి రెండ్రోజుల క్రితం క్షేమంగా తిరిగివచ్చిన సిల్క్యారా సొరంగ కార్మికులు ఇప్పుడు అక్కడే ఉండి ఎప్పటిలా పనిచేసుకోవాలా, సొంత ఊళ్లకు వెళ్లిపోవాలా అనే ఊగిసలాటలో ఉన్నారు. -
నా దృష్టిలో పెద్దకులాలు ఆ నాలుగే
‘నా దృష్టిలో నాలుగు పెద్ద కులాలవారంటే పేదలు, యువత, మహిళలు, రైతులు. వారి ఎదుగుదలతోనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) కనిపించింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) సుశాంత నందొ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరాలు వెల్లడించారు. -
కన్నూర్ వర్సిటీ వీసీగా రవీంద్రన్ పునర్నియామకం కొట్టివేత
కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ ఉప కులపతి (వైస్ఛాన్సలర్/వీసీ)గా గోపీనాథ్ రవీంద్రన్ పునర్నియామకాన్ని సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. -
విమానంలో నీటి ధార
విమానంలో క్యాబిన్ పైకప్పు నుంచి ఏర్పడిన నీటి లీకేజీతో ప్రయాణికులు ఇబ్బంది పడిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. -
శోమాకాంతి సేన్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించిన ఎన్ఐఏ
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు శోమాకాంతి సేన్ ఆరోగ్య కారణాలతో సుప్రీంకోర్టులో పెట్టుకున్న మధ్యంతర బెయిల్ అభ్యర్థన పిటిషన్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గట్టిగా గురువారం వ్యతిరేకించింది. -
నాడు భారత్ను ద్వేషించి.. నేడు ప్రేమించి..!
అమెరికా భద్రతా సలహదారుడిగా, విదేశాంగ మంత్రిగా హెన్రీ కిసింజర్ 70వ దశకంలో తీవ్ర భారత్ వ్యతిరేకవైఖరిని అవలంబించారు. పాకిస్థాన్తో మాత్రం సత్సంబంధాలు కొనసాగించారు. -
కుర్చీ పట్టుకోమ్మా.. లేదా ఆమె కూర్చుంటుంది: మోదీ
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎక్కువమందికి చేర్చడానికి ఉద్దేశించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’లో భాగంగా వివిధ స్కీంల లబ్ధిదారులను ఉద్దేశించి గురువారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. -
సాధ్యమైనంత త్వరగా తదుపరి విడత సైనిక చర్చలు
తూర్పు లద్దాఖ్లో బలగాల ఉపసంహరణను పూర్తిచేయడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై భారత్, చైనాలు గురువారం దౌత్యపరమైన చర్చలు జరిపాయి. -
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ రేపు
ఈ నెల 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. -
జ్ఞానవాపి సర్వే నివేదిక సమర్పణకు 10 రోజుల గడువు
ఉత్తర్ప్రదేశ్లోని కాశీలో జ్ఞానవాపి మసీదు ఆవరణలో భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) నిర్వహించిన సర్వే నివేదిక తయారీ, సమర్పణకు వారణాసి జిల్లా కోర్టు మరో 10 రోజుల గడువిచ్చింది.


తాజా వార్తలు (Latest News)
-
టాప్గేర్లో టూవీలర్ విక్రయాలు.. ఏ కంపెనీ ఎన్నంటే?
-
Maharashtra: అజిత్ పవార్కు భాజపా సుపారీ.. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి సంచలన ఆరోపణలు
-
PM Modi: భారత్లో కాప్-33 సదస్సు.. దుబాయ్లో ప్రతిపాదించిన మోదీ
-
YS Bhaskarreddy: సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్ భాస్కర్రెడ్డి
-
Nagarjunasagar: సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణలో సాగర్ డ్యామ్: కేంద్రం హోంశాఖ నిర్ణయం
-
Review Calling Sahasra: రివ్యూ: కాలింగ్ సహస్ర.. సుధీర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?