ఆ ఆటోవాలాకు నయా జీవితం

ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేస్తానన్న మనవరాలికి ధైర్యం చెప్పి ఆమె చదువు కోసం ఇంటిని అమ్మేసిన ఆటో వాలాకు కొత్త జీవితం లభించింది. ఆయ దీన గాథపై స్పందించిన దాతలు రూ.24 లక్షలు సమకూర్చారు....

Updated : 24 Feb 2021 12:45 IST

రూ.24 లక్షల ఆర్థిక సాయం

ముంబయి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేస్తానన్న మనవరాలికి ధైర్యం చెప్పి ఆమె చదువు కోసం ఇంటిని అమ్మేసిన ఆటో వాలాకు కొత్త జీవితం లభించింది. ఆయ దీన గాథపై స్పందించిన దాతలు రూ.24 లక్షలు సమకూర్చారు. దీంతో ఆ బక్క పల్చని వృద్ధుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అసలు ఎవరీ తాత, ఏమిటి ఆయన గాథ అంటే..

ఆరేళ్ల క్రితం పెద్ద కొడుకును కోల్పోయి, మరి కొద్ది కాలానికి చిన్న కుమారుడిని కోల్పోవడంతో ముంబయికి చెందిన దేశ్‌రాజ్‌, ఆయన భార్య, ఇద్దరు కోడళ్లు, వారి నలుగురు పిల్లల జీవితం అగమ్యగోచరంగా మారింది. దీంతో ఆ వృద్ధుడు కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచే ఆటో నడుపుతూ అర్ధరాత్రి వరకూ కష్టపడేవాడు. నెలంతా కష్టపడితే రూ.10 వేలు వచ్చేవి. అందులో రూ.6 వేలు పిల్లల ఫీజులకు పోగా, మిగతా డబ్బులతోనే ఆ కుబుంబం నెలంతా నెట్టుకొచ్చేది.

టీచర్‌ కావాలనేది దేశ్‌రాజ్‌ మనవరాలి ఆశయం. కానీ ఇంటి ఆర్థిక పరిస్థితులు చూసిన ఆమె చదువు మానేస్తానని తాతతో చెప్పింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానేయొద్దని చెప్పిన దేశ్‌రాజ్‌ ఆమె చదువు కోసం వారు ఉంటున్న ఇంటిని అమ్మేసి ఆమెను దిల్లీలోని ఓ కళాశాలలో బీఈడీ కోర్సులో చేర్పించాడు. మిగతా కుటుంబసభ్యులను ఆయన సొంతూరిలోని బంధువుల ఇంటికి పంపించాడు. దేశ్‌రాజ్‌ మాత్రం ముంబయిలోనే ఆటో నడుపుతూ అందులోనే జీవించేవాడు. ఆటోలోనే తినేవాడు. అందులోనే పడుకునేవాడు. ఈ నేపథ్యంలోనే దేశ్‌రాజ్‌ గురించి ప్రముఖ సామాజిక మాధ్యమం పేజీ హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వృద్ధుడి దీన గాథ చదివిన నెటిజన్లు చలించిపోయారు. ఓ ఫేస్‌బుక్‌ యూజర్‌ ఫండ్‌రైజింగ్ చేపట్టగా మొత్తం రూ.24 లక్షలు సమకూరాయి. దీంతో ఆ వృద్ధుడి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. స్పందించిన దాతలందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని