Mumbai: ముంబయిలో మరిన్ని ఆంక్షలు.. సాయంత్రం 5 తర్వాత ఆ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు..!
మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజధాని ముంబయిలో మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చింది. బీచ్లు, మైదానాలు, పార్క్లు,
ముంబయి: మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజధాని ముంబయిలో మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చింది. బీచ్లు, మైదానాలు, పార్క్లు, ఉద్యానవనాల వంటి పబ్లిక్ ప్లేస్లకు సాయంత్రం 5 గంటల తర్వాత వెళ్లకుండా నిషేధం విధించింది. ఈ ఆంక్షలు నేటి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి.. జనవరి 15 వరకు అమల్లో ఉంటాయని ముంబయి పోలీసులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
‘‘గత కొన్ని రోజులుగా ముంబయిలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందువల్ల ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని నిషేధాజ్ఞాలు జారీ చేస్తున్నాం. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గానూ ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడంపై నిషేధం విధిస్తున్నాం. ఈ సమయాల్లో పార్క్లు, బీచ్లు, మైదానాలు, నడకదారులు(ప్రత్యేకంగా వాకింగ్ చేసుకునేందుకు ఏర్పాటు చేసేవి), సముద్ర తీరం వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదు’’ అని ముంబయి పోలీసులు వెల్లడించారు. నూతన సంవత్సరం రోజున బహిరంగ పార్టీలపై కూడా అధికారులు నిషేధం విధించారు.
మహారాష్ట్రపై కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా అక్కడ కొత్త కేసులు పెరుగుతుండటంతో పాటు ఒమిక్రాన్ వ్యాప్తి కూడా విపరీతంగా ఉంది. అంతక్రితం వారంతో పోలిస్తే కేసుల సంఖ్య 5 రెట్లు పెరగడం గమనార్హం. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 198 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి పెరిగింది. వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిన్న కొవిడ్ టాస్క్ ఫోర్స్తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలోనే ముంబయిలో కొత్త ఆంక్షలు విధిస్తూ పోలీసులు నేడు ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్