Lalu Prasad Yadav: కదలికలు లేని స్థితిలో లాలూ.. తేజస్వీ యాదవ్ వెల్లడి
దిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా కిడ్నీ, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. అయితే.. కండరాలు, కీళ్లు పట్టేయడంతో లాలూ శరీర కదలికలు అతి స్వల్పంగా ఉన్నాయంటూ ఆయన తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ వెల్లడించారని ఓ వార్తాసంస్థ తెలిపింది. ‘ఇటీవల మెట్లపై నుంచి కిందపడిపోవడంతో ఆయన శరీరంలో మూడు చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలో కీళ్లు, కండరాలు పట్టేయడంతో.. సమస్య తీవ్రంగా మారింది. ఎక్కువగా కదల్లేకపోతున్నారు’ అని తేజస్వీ వివరించారు. త్వరలో కోలుకుంటారని తామంతా ఆశిస్తున్నామని, ఆసుపత్రిలో ఆయన వెంటే ఉన్నామని చెప్పారు. ఇటీవల లాలూ.. పట్నాలోని ఆయన నివాసంలో మెట్లపైనుంచి పడిపోవడంతో కుడి భుజం ఎముక విరిగిన విషయం తెలిసిందే.
తొలుత పట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన లాలూను.. మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి దిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ‘ఎయిమ్స్ వైద్యులకు నాన్న వైద్య అవసరాలు తెలుసు. అందుకే ఇక్కడ చేర్చాం’ అని తేజస్వి తెలిపారు. ‘లాలూ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ఆయన క్షేమం కోసం ప్రార్థించండి. అతి త్వరలో ఇంటికి తిరిగి వస్తారు’ అని లాలూ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి తెలిపారు. లాలూ యాదవ్ తన ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొంటూ.. కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ వెళ్లేందుకు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. అయితే, భుజానికి గాయమైన నేపథ్యంలో.. దిల్లీ వైద్యుల సలహా ప్రకారం ముందుకెళ్తామని తేజస్వీ తెలిపారు. బుధవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. పట్నా ఆసుపత్రిలో లాలూను కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను వాకబు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
TSRTC: ఆర్టీసీకి భారీ గి‘రాఖీ’.. రికార్డు స్థాయిలో వసూళ్లు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలు.. వరుస సెలవులతో అనూహ్య రద్దీ
-
Ap-top-news News
Hindupuram: హిందూపురంలో ‘ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం’ రెడీ..
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Ross Taylor : ఆ మ్యాచ్లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- Taliban: కాబుల్లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!