Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
మహారాష్ట్ర రాజకీయంలో పలు నాటకీయ పరిణామాల తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రే తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై ఆయన కుమారుడు, శివసేన మంత్రి ఆదిత్య ఠాక్రే తాజాగా స్పందించారు.
ముంబయి: మహారాష్ట్ర రాజకీయంలో పలు నాటకీయ పరిణామాల తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై ఆయన కుమారుడు, శివసేన(Shiv sena) మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే(Aaditya Thackeray) తాజాగా స్పందించారు. సీఎంను సొంత పార్టీ నేతలే మోసం చేశారని ఆరోపించారు. పార్టీలో ఇలాంటి దుష్టశక్తులు(రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి) ఉన్నారని తనకి, తన తండ్రికి ముందే తెలుసన్నారు. కానీ, సొంత పార్టీ మీదే ఇలా తిరుగుబాటు చేస్తారని ఊహించలేకపోయామని చెప్పారు. ఈ మేరకు ప్రముఖ వార్త సంస్థతో గురువారం ఆయన మాట్లాడారు.
‘‘సొంత పార్టీ నేతలని తన కుటుంబసభ్యులుగా సీఎం ఆదరించారు. అలాంటి వ్యక్తిపై తిరుగుబాటు చేస్తారని ఎవరం ఊహించలేకపోయాం. అయినా, సొంత కుటుంబం లాంటి పార్టీపై ఎవరైనా తిరుగుబాటు చేస్తారా? మా నాన్న, తాత, వాళ్ల నాన్న అందరూ అధికారం, డబ్బు వచ్చి వెళ్లిపోతాయనే నమ్మేవారు. అవిపోతే తిరిగి సంపాదించుకోగలం. కానీ, పరువు, గౌరవం ఒకసారి పోతే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. మేం ఈ సిద్ధాంతాన్నే నమ్మాం. ప్రజలకు సేవ చేయడానికే మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఇకముందు ఏం జరుగుతుందో కూడా చూస్తాం’’ అని అన్నారు.
వారి సిద్ధాంతం భిన్నమైంది..
ఒకేరకమైన సిద్ధాంతాలున్న భాజపాను కాదని ఎన్సీపీ, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారనే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణమని ఇప్పటివరకు చెప్పుకొచ్చారు. అయితే, దీనిపై ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. ‘‘బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వ సిద్ధాంతానికి వారు(రెబల్ ఎమ్మెల్యేలు) భావించేదానికి చాలా తేడా ఉంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక నేనూ అయోధ్యకు వెళ్లాను. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నపుడు ఉద్ధవ్ఠాక్రే రెండుసార్లు వెళ్లి వచ్చారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసుకున్నాం. కాబట్టి మేం అనుసరించే హిందుత్వ సిద్ధాంతం భిన్నమైంది’’ అని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు.
అసూయపడడం చాలా బాధేసింది..
శివసేన పార్టీలో సీనియర్లను కాదని జూనియర్లకే మంత్రి పదవులు కట్టబెట్టారని పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. చిన్నప్పటి నుంచి తనను చూసినవాళ్లే తన ఎదుగుదలను చూసి అసూయపడడం చాలా బాధగా ఉందన్నారు. ‘‘మేం ప్రతి ఒక్కర్ని గౌరవించాం. 10-12 ఏళ్ల వయసు నుంచి చూస్తున్న పిల్లాడు మంచి పనులు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్నాడని.. దాన్ని చూసి సంతోషించి ఆ వ్యక్తిని ఆశీర్వదించాల్సిందిపోయి అసూయపడితే అక్కడ మానవత్వం, నైతిక విలువలు ఏమైపోయినట్టు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
నాన్నే చెప్పేవారు..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంలో తన తండ్రి చాలా దయతో వ్యవహరించారని ఆదిత్య ఠాక్రే అన్నారు. ‘‘ఆయనకు సీఎం సీటుతో అసలు మెటీరియల్ అటాచ్మెంట్ ఏం లేదు. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశాక అధికార నివాసం ‘వర్ష’ను వీడారు. రాజీనామా ఇచ్చారు. త్వరలో మళ్లీ వస్తానని రాష్ట్ర ప్రజలకు చెప్పి సీఎం పదవి నుంచి వైదొలిగారు. తగినంత సంఖ్యాబలం లేదని ఆయన అనుకోవచ్చు. ఆయన నాతో ఓ మాట చెప్పేవారు.. మనకు చెందనిది.. ఎప్పటికీ మనతో ఉండదు’’ అని ఆదిత్య ఠాక్రే తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
తొలి లోక్సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 71 వేల మంది ‘సెక్యూరిటీ డిపాజిట్’ కోల్పోయినట్లు ఈసీ విశ్లేషణలో వెల్లడైంది. -
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
తమిళనాడులోని సేలంలో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ నాయకుడి సేవలను గుర్తుచేసుకుని ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ? -
Himanta Biswa Sarma: ‘మేం గేట్లు తెరిస్తే..’: కాంగ్రెస్కు హిమంత వార్నింగ్
కాంగ్రెస్పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa Sarma) తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ప్రధాని మోదీ(Modi) సూర్యుడని కొనియాడారు. -
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. -
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
మిగతా నటీనటుల యాక్టింగ్ నచ్చినప్పటికీ.. అమితాబ్ బచ్చనే (Amitabh Bachchan) తనకు ఇష్టమైన నటుడని భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు. -
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ధిక్కార పిటిషన్పై సమాధానం ఇవ్వడంలో విఫలమైనందుకు పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
Liquor Policy Case: దిల్లీ మద్యం కుంభకోణంలో భారాస ఎమ్మెల్సీ కవిత తమ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఇదంతా కుట్రలో భాగమేనని ఆరోపించింది. -
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
తమ దేశీయుల్ని రక్షించడంలో భారత నౌకాదళం ప్రదర్శించిన ధైర్యసాహసాలకు బల్గేరియా నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. వీటికి ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. -
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. మహారాజ్గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. -
దుస్తుల్లేని చిన్ననాటి ఫొటోపై అభ్యంతరం.. అకౌంట్ను నిలిపివేసిన గూగుల్
చిన్నప్పటి ఫొటోను డ్రైవ్లోకి అప్లోడ్ చేసిన వ్యక్తికి గూగుల్ షాకిచ్చింది. అతడి అకౌంట్ను నిలిపివేసింది. దీనిపై ఏడాదిగా గూగుల్తో పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. -
ఎన్నికల బాండ్ల సమాచారమంతా వెల్లడించాల్సిందే
ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంక్ విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. -
పశ్చిమ బెంగాల్ డీజీపీపై వేటు
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీతోపాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తప్పించింది. వారితోపాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. -
ఆజం ఖాన్కు ఏడేళ్ల జైలుశిక్ష
ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు స్థానిక కోర్డు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. 2016లో దుంగార్పుర్లో ఒక ఇంటిని బలవంతంగా కూల్చివేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. -
‘సామాజిక’ ప్రచారం
ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా వాట్సప్, సామాజిక మాధ్యమాలు, ఇన్ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరిగింది. -
వేడెక్కుతున్న ఉత్తర భారతం
ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్ శాస్త్రజ్ఞుల బృందం క్లైమేట్ సెంట్రల్ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో ఉత్తర భారత్లో ఉష్ణోగ్రతల తీరుతెన్నులను విశ్లేషించింది. -
స్నేహమంటే అదే కదా.. నేవీ ఆపరేషన్పై జై శంకర్ స్పందన
సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం కాపాడిన విషయం తెలిసిందే. దాంతో మన రక్షణ సిబ్బంది చేసిన ఆపరేషన్పై బల్గేరియా నుంచి కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి. -
మమ్మల్ని దర్యాప్తు సంస్థలా మార్చకండి
గుజరాత్ యూనివర్సిటీలో గత వారాంతంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడిని సుమోటోగా స్వీకరించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తిరస్కరించింది. -
పోలీసు కాల్పుల్లో ఉపాధ్యాయుడి మృతి
ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్లో చిన్నపాటి ఘర్షణ కారణంగా హెడ్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ రెబల్స్కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట
కాంగ్రెస్ పార్టీ విప్ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి అనర్హులైన ఆరుగురు రెబల్స్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
-
Hyderabad: ప్రణీత్రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్లో ఎవరున్నారంటే?
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం