భారత్ ఆశ్రయం కోరుతున్న మయన్మార్ పోలీసులు!
భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన మయన్మార్ పోలీసులు, ఇక్కడ ఆశ్రయం కోరినట్లు భారత అధికారులు వెల్లడించారు.
సైనిక హింసపై పెరుగుతున్న వ్యతిరేకత
దిల్లీ: మయన్మార్లో కొనసాగుతున్న సైనిక పాలనను అక్కడి ప్రజలే కాకుండా పోలీసులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేస్తున్న వారిపై సైన్యం దారుణ అణచివేతకు పాల్పడుతోంది. దీంతో ప్రజలే కాకుండా సైనిక ఆజ్ఞలను పాటించలేని పోలీసులు కూడా భారత్కు వచ్చి తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన మయన్మార్ పోలీసులు, ఇక్కడ ఆశ్రయం కోరినట్లు భారత అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇలా వచ్చే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు.
మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడడంతో పాటు ఆంగ్సన్ సూకీని విడుదల చేయాలని మయన్మార్లో ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ నిరసనలకు ప్రజలతో పాటు కొంతమంది పోలీసులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇక సైన్యం హింసను భరించలేని కొందరు భారత్ సరిహద్దుల ద్వారా దేశంలోకి చొరబడి ఇక్కడ తలదాచుకుంటున్న ఘటనలు ఈ మధ్య వెలుగులోకి వచ్చాయి. అక్కడి సైన్యం ఆదేశాలను అమలు చేయలేని పోలీసులపైనా సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. దీంతో సైనిక చర్యకు బయపడుతున్న కొందరు పోలీసులు, భారత్లోకి ప్రవేశించి తలదాచుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇలా ఇప్పటివరకు 19మంది మయన్మార్ పోలీసులు మిజోరాం సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న భారత అధికారులు, వారి ఆరోగ్యాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మయన్మార్ నుంచి భారత్కు వచ్చిన వేల మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, అక్కడి పోలీసులే పారిపోయి వచ్చి ఆశ్రయం పొందడం మాత్రం అరుదైన విషయమని భారత అధికారులతో పాటు రిఫ్యూజీ కమిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్