Myanmar: శరణార్థిగా ముఖ్యమంత్రి..
మయన్మార్లో సైనిక పాలకుల దాష్టీకంతో అక్కడి లక్షలాది మంది ప్రజలు ప్రాణభయంతో పొరుగు దేశాలకు పారిపోతున్నారు. భారత్లోనూ అనేక మంది ఆశ్రయం పొందారు. తాజాగా
గువాహటి: మయన్మార్లో సైనిక పాలకుల దాష్టీకంతో అక్కడి లక్షలాది మంది ప్రజలు ప్రాణభయంతో పొరుగు దేశాలకు పారిపోతున్నారు. భారత్లోనూ అనేక మంది ఆశ్రయం పొందారు. తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన దేశానికి శరణార్థిగా వచ్చినట్లు తెలిసింది. మయన్మార్లోని చిన్ రాష్ట్ర సీఎం సలై లియాన్ లుయాయ్ మిజోరంలో ఓ శరణార్థుల శిబిరంలో ఆశ్రయం పొందినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. లుయాయ్.. సోమవారం రాత్రి చంపాయ్లోని సరిహద్దును దాటి మిజోరంకు వచ్చినట్లు పేర్కొన్నాయి.
పశ్చిమ మయన్మార్లో ఉండే చిన్ రాష్ట్రానికి మిజోరంలోని ఆరు జిల్లాలతో సరిహద్దు ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్లో సైనిక తిరుగుబాటు తర్వాత ఆ దేశం నుంచి వేలాది మంది భారత్కు వలసవచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు మిజోరంలో 9,247 మంది మయన్మార్ వాసులు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో చట్టసభ్యులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు.
చాలా మందికి స్థానికులే ఆశ్రయం కల్పిస్తుండగా.. కొన్ని ఎన్జీవోలు, యూత్ ఆర్గనైజేషన్లు కూడా శరణార్థుల కోసం శిబిరాలు ఏర్పాటు చేశాయి. అటు ప్రభుత్వం కూడా వీరికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. తమ రాష్ట్రంలో ఆశ్రయం కోసం వచ్చిన వారికి సాయం చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా నిన్న వెల్లడించారు. మరో ఈశాన్య రాష్ట్రం మణిపూర్లోనూ చాలా మంది ఆశ్రయం పొందుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన అక్కడి సైన్యం పాలనాధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సైన్యం పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో వారిపై సైనికులు దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో అనేక మంది ప్రజలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సైన్యం ఆగడాలను భరించలేని మయన్మార్ వాసులు పొరుగుదేశాలకు వలస వెళ్లి తలదాచుకుంటున్నారు. అలా భారత్తో పాటు బంగ్లాదేశ్, థాయ్లాండ్కు చాలా మంది వెళ్లిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!