Narendra Giri: ‘తలకు గాయాలున్నాయి.. సూసైడ్ నోట్ ఆయన రాయలేదు’
నరేంద్రగిరి మృతిపై నిరంజని అఖాడా అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు.....
ప్రయాగ్రాజ్: అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్రగిరి అనుమానాస్పద మృతి అనంతరం విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శిష్యుడు ఆనంద్ గిరితోపాటు మరికొందరు బ్లాక్మెయిల్ చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెల్లడించారు. కాగా నరేంద్రగిరి మృతిపై నిరంజని అఖాడా అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయనది ఆత్మహత్య కాదని.. తలకు గాయాలున్నట్లు పేర్కొన్నారు. నరేంద్రగిరి గదిలో లభించిన సూసైడ్ నోట్ కూడా ఆయన రాయలేదని ఆరోపించారు.
రవీంద్ర పూరి ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే అతడి తలకు గాయాలు ఎలా ఉంటాయి? ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల నాలుక బయటకు వస్తుంది. కానీ నరేంద్రగిరి విషయంలో అలా లేదు. సూసైడ్ నోట్ ఆయన రాసినట్లు లేదు. డిగ్రీ పూర్తి చేసిన ఓ విద్యార్థి రాసినట్లు ఉంది’ అని పేర్కొన్నారు. నరేంద్రగిరి ఆత్మహత్య చేసుకునే అంత పిరికి వ్యక్తి కాదని తెలిపారు.
నరేంద్రగిరి అనుమానాస్పద మృతి అనంతరం అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అతిథి గృహంలో ఓ సూసైడ్ నోట్ లభించిందని.. అందులో మహంత్ పలు విషయాలను ప్రస్తావించినట్లు పోలీసులు పేర్కొన్నారు. శిష్యుడు ఆనంద్గిరి కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యారని, తప్పుడు ఆధారాలు సృష్టించి తనను బ్లాక్మెయిల్ చేయడం వల్లే మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు నోట్లో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఆనంద్గిరితోపాటు ఆధ్య తివారి, అతడి కుమారుడు సందీప్ తివారి కూడా తన ఆత్మహత్యకు కారణమని ఆ నోట్లో వెల్లడించారు.
ఈ కేసులో ఆనంద్గిరితోపాటు ఆధ్య తివారిని ప్రయాగ్రాజ్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వారిని కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?