Modi: కరోనా విపత్తు వేళ యోగా ఆశా కిరణం
యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగం
దిల్లీ : యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగించారు.
‘కరోనాతో భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దేశంలోని ప్రతి మూలా లక్షలాది మంది యోగా సాధకులుగా మారారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలి. యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్యం సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిక దృఢత్వాన్ని యోగా పెంపొందిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది’ అని ప్రధాని వెల్లడించారు.
క్లిష్ట సమయంలో విశ్వాసం పాదుకొల్పిన సాధనం..
‘కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచంపై దాడి చేసినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఏ ఒక్క దేశం వద్ద సరైన వసతులు లేవు. మానసికంగా దానితో పోరడడానికి సిద్ధంగా లేం. అలాంటి కష్ట సమయంలో ఆత్మ విశ్వాసం పెంపొందించే సాధనంగా యోగా మారింది. ఫ్రంట్లైన్ వర్కర్లు యోగాను ఓ సురక్షా కవచంగా మార్చుకున్నట్లు నాతో తెలిపారు. వారిని వారు రక్షించుకోవడంతో పాటు కరోనా బాధితుల్ని కాపాడడానికి కూడా యోగాను ఉపయోగించుకున్నారు. బాధితులకు వైద్యులు యోగా సాధన చేయిస్తున్న చిత్రాలు ఉన్నాయి. మహమ్మారి మూలంగా ఇన్నాళ్లు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలన్న స్ఫూర్తి మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది థీమ్గా నిర్ణయించిన ‘యోగా ఫర్ వెల్నెస్’ వల్ల ప్రజలు యోగాను మరింత విస్తృతంగా సాధన చేస్తారని భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ అన్నారు.
ప్రతికూల ఆలోచనల నుంచి ఆవిష్కరణల వైపు..
‘ప్రతికూల ఆలోచనల నుంచి ఆవిష్కరణల వైపు మళ్లించే శక్తి యోగాకు ఉంది. మనలో ఇమిడి ఉన్న శక్తిని వెలికితీయడానికి దోహదం చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడి శక్తిమంతంగా మారేందుకు బాటలు వేస్తుంది. వైద్యశాస్త్రం సైతం చికిత్సతో పాటు స్వస్థత ప్రక్రియలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. యోగాకు స్వస్థత చేకూర్చే శక్తి ఉంది. మన శరీరంపై యోగా ప్రభావాన్ని ఆవిష్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి’ అని ప్రధాని వివరించారు.
ఎమ్-యోగా యాప్..
యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగా సే సహయోగ్ తక్’ అన్న మంత్రాన్ని ప్రజలకు అందించిన ప్రధాని మోదీ ఎమ్-యోగా అనే మొబైల్ యాప్ను ప్రారంభించారు. దీంతో యోగా శిక్షణకు సంబంధించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయన్నారు. వివిధ భాషల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ యాప్ దోహదం చేయనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.