
Molnupiravir: కొవిడ్ చికిత్స అనుమతివ్వండి!
‘సీడీఎస్సీఓ’కు నాట్కో ఫార్మా దరఖాస్తు
దిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. చికిత్సలో వినియోగించే ఔషధాలపై ఫార్మా సంస్థలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా నాట్కో ఫార్మా తయారుచేసిన ‘మోల్నుపిరావిర్’ ఔషధం మూడోదశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ)కు దరఖాస్తు చేసుకున్నట్లు నాట్కో ఫార్మా సంస్థ వెల్లడించింది.
‘కరోనా రోగులపై మోల్నుపిరావిర్ ఔషధం మూడోదశ ప్రయోగాలు జరిపేందుకు సీడీఎస్సీఓకు దరఖాస్తు చేసుకున్నాం’ అని నాట్కో ఫార్మా సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఈ ఔషధం ఇన్ఫ్లుయెంజాకు వ్యతిరేకంగా పోరాడడంతో పాటు కరోనా వైరస్కు కారణమయ్యే సార్స్-కోవ్-2 ప్రతిరూపాన్ని నిరోధించడంలో శక్తిమంతంగా పనిచేసినట్లు ప్రీ-క్లినికల్ ప్రయోగ ఫలితాల్లో తేలినట్లు నాట్కో ఫార్మా పేర్కొంది. క్యాప్సూల్ రూపంలో ఉండే మోల్నుపిరావిర్ ఔషధం తీసుకున్న ఐదురోజుల్లోనే రోగుల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయని.. తద్వారా స్వల్ప వ్యవధిలోనే రోగులు కోలుకోకుంటారనే విషయాన్ని ఇది సూచిస్తుందని నాట్కో సంస్థ గుర్తుచేసింది. ఈ ఔషధాన్ని మాత్రల రూపంలో(నోటిద్వారా) తీసుకునే సౌలభ్యం ఉండడం మరో ప్రయోజనకర విషయమని పేర్కొంది.
ఇప్పటివరకు ఉన్న ప్రయోగ ఫలితాల సమాచారంపై పూర్తి విశ్వాసం ఉన్నందున తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు అత్యవసర వినియోగానికి సీడీఎస్సీఓ అనుమతి ఇస్తుందని భావిస్తున్నామని నాట్కో ఫార్మా అభిప్రాయపడింది. ఒకవేళ అనుమతి లభిస్తే.. ఈ ఔషధాన్ని ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకువస్తామని నాట్కో ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే, కరోనా చికిత్సలో వాడేందుకు జైడస్ క్యాడిల్ తయారుచేసిన ‘విరాఫిన్’కు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఒకే మోతాదులో వాడే విరాఫిన్ యాంటీవైరల్ ఇంజక్షన్ కొవిడ్ చికిత్సలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జైడస్ సంస్థ పేర్కొంది. మధ్యస్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా దీన్ని అందిస్తారు. ఇప్పటికే తీవ్ర కరోనాతో బాధపడేవారికి రెమ్డెసివర్ ఇంజక్షన్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్ర రూపంలో ఉండే ఔషధ అనుమతి కోసం నాట్కో ఫార్మా ప్రయత్నాలు చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- social look: లవ్లో పడిన రష్మి.. జిమ్లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- IND vs ENG: యువరాజ్ సింగ్ను గుర్తుచేసిన బుమ్రా
- Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
- Congress: తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రేపిన యశ్వంత్సిన్హా పర్యటన