టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు ‘వ్యాక్సిన్‌ ట్రాకర్‌’!

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం వాటి ప్రభావాలు, భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఇన్‌ఫెక్షన్లను తెలుసుకునేందుకు జాతీయ స్థాయిలో వ్యాక్సిన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ రాబోతుంది.

Published : 14 May 2021 20:50 IST

త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం వాటి ప్రభావాలు, భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఇన్‌ఫెక్షన్లను తెలుసుకునేందుకు జాతీయ స్థాయిలో వ్యాక్సిన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ రాబోతుంది. వ్యాక్సిన్‌ తొలి డోసు, పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత కలిగే ప్రభావాలను అంచనా వేసేందుకు ఈ నూతన వేదికను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వ్యాక్సిన్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) చేసిన సిఫార్సుకు జాతీయ నిపుణుల కమిటీతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతించిందని వ్యాక్సిన్‌ వర్కింగ్‌ గ్రూప్‌లోని సభ్యులు డాక్టర్‌ ఎన్‌కే అరోడా వెల్లడించారు. ముఖ్యంగా వ్యాక్సిన్‌ (కొవిషీల్డ్‌) డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచిన నేపథ్యంలో వీటి అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. క్షేత్ర స్థాయిలో వ్యాక్సిన్‌ ప్రభావాలను సమీక్షించేందుకు ఐసీఎంఆర్‌తో పాటు ఇతర సంస్థలకు ఈ సమాచారం ఎంతో దోహదపడుతుందని NTAGI సిఫార్సు చేసిందన్నారు.

వీటితోపాటు గర్భిణీలు, బాలింతలు కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌లలో ఏదైనా ఎంచుకోవచ్చని NTAGI సూచనలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎవరైనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న తర్వాత వైరస్‌ బారినపడితే.. అలాంటివారు కోలుకున్న 4నుంచి 8వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాలని సూచించింది. ఇక ప్లాస్మా చికిత్స తీసుకున్న కొవిడ్‌ బాధితులు డిశ్చార్జి తర్వాత మూడు నెలల వరకు వ్యాక్సిన్‌ను వాయిదా వేసుకోవాలని NTAGI సిఫార్సు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని