
Navjot Singh Sidhu: నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు
దిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలు శిక్ష పడింది. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 1988లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసులో సిద్ధూను రూ.1000 జరిమానాతో విడిచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. 1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్ విషయంపై 65ఏళ్ల గుర్నామ్ సింగ్కు సిద్ధూ, తన స్నేహితుడు రూపిందర్ సింగ్లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుర్నామ్ సింగ్ను కారు నుంచి బయటకు లాగి సిద్దూ- రూపిందర్ సింగ్ సంధు అతడి తలపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గుర్నామ్ సింగ్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
అయితే, ఈ కేసులో 1999లో పటియాలాలోని సెషన్స్ కోర్టు సాక్ష్యాధారాలు సరిగా లేవని పేర్కొంటూ సిద్ధూ, అతడి స్నేహితుడిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధిత కుటుంబం పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించగా.. 2006లో సిద్ధూను హైకోర్టు దోషిగా తేల్చింది. నేరపూరిత హత్యగా పేర్కొంటూ మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో 2018లో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గుర్నామ్ సింగ్ను హత్య చేశారనేందుకు ఆధారాల్లేవంటూ హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. కానీ, సీనియర్ సిటిజన్ను గాయపరిచినందుకు సిద్ధూను దోషిగా తేల్చుతూ జైలు శిక్ష లేకుండా.. రూ.1000 జరిమానా విధించింది.
అయితే, ఈ తీర్పును వ్యతిరేకిస్తూ 2018 సెప్టెంబర్లో గుర్నామ్ సింగ్ కుటుంబం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయగా.. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఎస్కే కౌల్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. ఈ కేసులో లోపం ఉందని భావించినట్టు పేర్కొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. అందుకే జైలు శిక్షపై రివ్యూ పిటిషన్ విచారణకు అనుమతించినట్టు తెలిపింది. జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష కూడా సముచితమని భావించినట్టు తీర్పు వెలువరించే సమయంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు-లారీ ఢీ: ఒకరు మృతి, 20 మందికి గాయాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
India News
Jammu: జమ్మూలో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు సిద్ధమే: హనుమ విహారి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- కథ మారింది..!
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- Mahesh babu: బిల్ గేట్స్తో మహేశ్బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?