INS Visakhapatnam: విధుల్లోకి ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’.. ప్రత్యేకతలెన్నో!
దేశ తీరప్రాంత రక్షణకు ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ నౌక ఆదివారం ముంబయిలో విధుల్లో చేరింది....
ముంబయి: దేశ తీరప్రాంత రక్షణకు ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ నౌక ఆదివారం ముంబయిలో విధుల్లో చేరింది. ఇదే భారత తొలి ‘స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్’ కావడం విశేషం. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు నౌకాదళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘ప్రాజెక్టు15బీ’ పేరుతో మొత్తం నాలుగు అత్యంత అధునాతన నౌకలను తయారు చేస్తున్నారు. ముంబయి మజగాన్ డాక్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ నౌకను నిర్మించారు. నౌకలకు ప్రముఖ నగరాల పేర్లను పెట్టే సంప్రదాయానికి అనుగుణంగా విశాఖకు కేటాయించిన నౌకకు ‘ఐ.ఎన్.ఎస్.విశాఖపట్నం’ అని నామకరణం చేశారు. మున్ముందు తూర్పునౌకాదళ పరిరక్షణలో కీలకపాత్ర పోషించనుంది.
ప్రత్యేకతలెన్నో...
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులను దీన్నించి ప్రయోగించవచ్చు. ఈ నౌక కదలికల్ని శత్రుదేశ రాడార్లు గుర్తించలేని విధంగా అధునాతన పరిజ్ఞానాల్ని ఉపయోగించారు. జలాంతర్గాములను కూడా గుర్తించి దాడి చేయడానికి వీలుగా శక్తిమంతమైన టోర్పెడోలను పొందుపరిచారు. రెండు మల్టీరోల్ హెలీకాప్టర్లు ఇందులో ఉంటాయి.
డాల్ఫిన్స్ నోస్ కొండకు గుర్తింపు...
నౌక శిఖర భాగంలో ఏర్పాటు చేసే ముద్రకు విశాఖలోని డాల్ఫిన్ నోస్ కొండ, దానిపై దీపస్తంభానికి స్థానం కల్పించారు. నౌక గుర్తింపు చిహ్నం(లోగో)గా కొమ్ములతో కనిపించే కృష్ణ జింక ముఖం ముందుభాగాన్ని ఖరారు చేశారు. అత్యంత అప్రమత్తతకు, తీవ్రమైన వేగానికి కృష్ణజింకలు నిదర్శనంగా నిలుస్తాయన్న ఉద్దేశంతో ఆ చిహ్నాన్ని పొందుపరిచారు. అప్రమత్తతో, పరాక్రమంతో, విజేతగా నిలువాలన్న లక్ష్యాన్ని చిహ్నం కింద చేర్చారు. హిందూ మహాసముద్రంలో సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ఐఎన్ఎస్ విశాఖపట్నం విధుల్లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చైనా బాధ్యతారహిత దేశం..
ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ చైనాపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. డ్రాగన్ను బాధ్యతారహిత దేశంగా అభివర్ణించారు. ‘‘కొన్ని బాధ్యతారహిత దేశాలు తమ సంకుచిత, పక్షపాత ప్రయోజనాల కోసం, ఆధిపత్య ధోరణులతో ఐరాస ‘కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ(UNCLOS)’ని తప్పుగా నిర్వచిస్తున్నాయి. ఇలా ఏకపక్ష వివరణల వల్ల యూఎన్సీఎల్ఓఎస్ పదేపదే బలహీనపడటం ఆందోళన కలిగిస్తోంది’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీలం నదిలో పడవ బోల్తా.. పలువురి గల్లంతు
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో జీలం నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. -
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
Salman Khan: సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వారిని తాజాగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్(జూన్-సెప్టెంబరు)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం తెలిపింది. -
112 ఏళ్ల టైటానిక్ విషాదం.. ఛత్తీస్గఢ్లో ఆరని విద్యాదీపం
సరిగ్గా 112 ఏళ్ల క్రితం ఏప్రిల్ 15న ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగి దాదాపు 1,500 ప్రాణాలను జలసమాధి చేసిన టైటానిక్ ఓడ విషాదం తలచుకొని ప్రపంచం ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది. -
పన్వెల్లో నెల రోజులుగా మకాం
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ బాంద్రా నివాసం వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు నవీ ముంబయి పన్వెల్లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
కేజ్రీవాల్ను కరడుగట్టిన తీవ్రవాదిలా చూస్తున్నారు
తిహాడ్ జైలులో ఉన్న ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ను సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జడ్ ప్లస్ భద్రత మధ్య కలుసుకున్నారు. -
2 నిమిషాలకు సరిపడా ఇంధనం ఉండగా ల్యాండింగ్
అయోధ్య నుంచి దిల్లీ బయల్దేరిన ఇండిగో విమానానికి ప్రమాదకర పరిస్థితి ఎదురైంది. వాతావరణం సహకరించకపోవడంతో దానిని చండీగఢ్కు మళ్లించారు. -
అవినీతి ఇకపై వాటికి ‘పాస్వర్డ్’ కాదు.. జైలుకెళ్లే మార్గం: జగదీప్ ధన్ఖడ్
అధికారగణంలో అవినీతి శక్తులకు అడ్డుకట్ట పడుతోందని..అవకాశాలు, ఉద్యోగాలకు ఇకపై అవినీతి అనేది ఓ పాస్వర్డ్లా కాకుండా జైలుకు వెళ్లే మార్గంలా ఉంటుందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. -
అన్ని సీజన్లలో సాగు చేసేలా 93 కొత్త ఉల్లి వంగడాలు
ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్లోని చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 93 రకాల కొత్త ఉల్లి వంగడాలను అభివృద్ధి చేశారు. -
అయోధ్య బాలరాముడికి ‘సూర్య తిలకం’
శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రామాలయంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ కనువిందు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు (8)
మథురలోని శ్రీకృష్ణజన్మభూమి ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో కోర్టు పర్యవేక్షిత సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అనుమతి అమలుపై నిలుపుదల (స్టే) ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది. -
నిబంధనల ప్రకారమే రాహుల్ హెలికాప్టర్ తనిఖీ
నిర్ణీత షెడ్యూల్ లేకుండా ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లపై ప్రామాణిక నిబంధనల ప్రకారమే నిఘా ఉంచడంతో పాటు తనిఖీ చేస్తున్నామని ఎన్నికల కమిషన్ (ఈసీ) వర్గాలు తెలిపాయి. -
కేజ్రీవాల్ కస్టడీ 23 వరకూ పొడిగింపు
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈ నెల 23 వరకు స్థానిక కోర్టు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
అనవసర ఒత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థను కాపాడుకోవాలి
వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వ్యూహాత్మకంగా న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లేలా ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది ప్రమాదకరమైన ధోరణి అని 21 మంది విశ్రాంత న్యాయమూర్తులు పేర్కొన్నారు. -
ఎన్నికల బాండ్ల రద్దుపై అందరూ బాధపడతారు: మోదీ
ఎన్నికల బాండ్ల విధానంపై నిజాయతీగా ఆలోచిస్తే.. వాటి రద్దు గురించి ప్రతిఒక్కరూ బాధపడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. -
రోజుకు రూ.100 కోట్లు!
ఎన్నికల సమయంలో వివిధ రాష్ట్రాల్లో రూ.4,658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. -
జైల్లో కేజ్రీవాల్.. ‘ఆ పత్రాలపై ఖైదీలు సంతకాలు చేయలేరు’ - జైళ్లశాఖ డీజీ
జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారు కేవలం రెండు రకాల పత్రాలపైనే సంతకాలు చేయగలరని, అవి రాజకీయ స్వభావం కలిగి ఉండకూడదని జైళ్లశాఖ వెల్లడించింది. -
‘వందే భారత్’ జోరు.. రెండు కోట్ల మంది ప్రయాణం!
‘వందే భారత్’ రైళ్లలో ఇప్పటివరకు రెండు కోట్ల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మరో ఆటగాడిని తీసుకోవాలని చెప్పా..’- ఐపీఎల్ నుంచి మ్యాక్స్వెల్ బ్రేక్
-
శిరోముండనం కేసుపై నేడు విశాఖ కోర్టు తీర్పు.. ఉత్కంఠ
-
ఎన్నికల కోడ్ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమట!
-
ఠారెత్తిస్తోన్న ఎండలు.. ఏం చేయాలి? ఏం చేయొద్దు?
-
జీలం నదిలో పడవ బోల్తా.. పలువురి గల్లంతు
-
నష్టాల్లోనే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186