Nawab Malik: షారుక్ ఖాన్.. ఇప్పటికైనా నోరు విప్పు: నవాబ్ మాలిక్
అసలు ఆర్యన్ ఖాన్ క్రూజ్ పార్టీకి టిక్కెట్టే కొనుగోలు చేయలేదని నవాబ్ మాలిక్ అన్నారు....
డ్రగ్స్ కేసు వ్యవహారంలో నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ముంబయి: క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు విషయంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కావడం వెనుక భాజపా నేత మోహిత్ కాంబోజ్ అనే వ్యక్తే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. ఈ కేసు పూర్తిగా అపహరణ, డబ్బు డిమాండ్కు సంబంధించింది మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
షారుక్ ఖాన్ ఇప్పటికైనా నిజాలు చెప్పాలి..
అసలు ఆర్యన్ ఖాన్ క్రూజ్ పార్టీకి టిక్కెట్టే కొనుగోలు చేయలేదని నవాబ్ మాలిక్ అన్నారు. ప్రతీక్ గాబా, అమీర్ ఫర్నీచర్వాలా అనే ఇద్దరు వ్యక్తులే ఆయన్ని అక్కడికి తీసుకెళ్లారన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు పూర్తిగా కిడ్నాపింగ్, డబ్బు డిమాండ్కు సంబంధించినదని చెప్పుకొచ్చారు. ఇక ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే, మోహిత్ కాంబోజ్ ఇద్దరూ డబ్బు డిమాండ్ చేసిన వారిలో ఉన్నారని ఆరోపించారు. ఆర్యన్ ఖాన్ అరెస్టయిన తొలిరోజు నుంచి షారుక్ ఖాన్కు బెదిరింపులు మొదలయ్యాయని తెలిపారు. ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడొద్దని షారుక్కు ఆదేశాలిస్తున్నారనన్నారు. ఇప్పటికైనా షారుక్ బయటకు వచ్చి నోరు విప్పాలన్నారు. కుమారుణ్ని కిడ్నాప్ చేస్తే డబ్బు ఇవ్వడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు.
అసలు విషయం అందులోనే..
ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే, మోహిత్ కాంబోజ్ మధ్య సాన్నిహిత్యం ఉందని నవాబ్ మాలిక్ అన్నారు. అక్టోబరు 7న వీరిద్దరూ ఓ శ్మశానం వద్ద కలిశారని ఆరోపించారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే తాను పెట్టిన ఓ ప్రెస్ మీట్ను ఈ సందర్భంగా మాలిక్ గుర్తుచేశారు. నౌక నుంచి అదుపులోకి తీసుకున్నవారిలో ముగ్గుర్ని ఎందుకు వదిలేశారని తాను అప్పట్లోనే ప్రశ్నించానన్నారు. అప్పుడు వదిలేసిన వారిలో రిషభ్ సచ్దేవ, ప్రతీక్ గాబా, అమీర్ ఫర్నీచర్వాలా ఉన్నారన్నారు. మోహిత్ కాంబోజ్కు రిషభ్ సచ్దేవ దగ్గరి బంధువని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గుర్ని వదిలేయడంలోనే అసలు విషయం దాగి ఉందని ఆరోపించారు.
ఆయన్ని అక్కడే ఆపేశారు...
ఇక మోహిత్ కాంబోజ్ ఆరోపిస్తున్నట్లుగా తానెప్పుడూ సునీల్ పాటిల్ అనే వ్యక్తిని కలవలేదన్నారు. ఈ కేసుపై తొలిసారి తాను ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే సునీల్ పాటిల్ ఫోన్ చేశారన్నారు. తనతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నానని చెప్పారన్నారు. అయితే, పోలీసులతో చెప్పాలని తాను సూచించానన్నారు. కానీ, గుజరాత్లోనే ఆయన్ని నిలిపివేశారన్నారు.
ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీయాలన్న కుట్ర..
ఈ వ్యవహారమంతా ఓ కుట్రలో భాగంగానే జరిగిందని నవాబ్ మాలిక్ ఆరోపించారు. క్రూజ్ షిప్లో ఫ్యాషన్ టీవీ ఇండియా ఎండీ కషిఫ్ ఖాన్కు సంబంధించిన ‘స్మోకింగ్ రోల్స్’ కూడా దొరికాయన్నారు. మరి ఆయన్నెందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ను కూడా పార్టీకి రావాలని కషిఫ్ ఖాన్ బలవంతం చేశారని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందన్నారు.
కోర్టుకు వెళ్లొచ్చు కదా?
నవాబ్ మాలిక్ ఆరోపణలపై ఎన్సీబీ అధికారులు స్పందించారు. సమీర్ వాంఖడేపై ఆరోపణలు చేస్తున్న ఆయన కోర్టును ఎందుకు సంప్రదించడం లేదని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.