నక్సల్స్ చెర నుంచి ఆ జవానుకు విముక్తి
ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్ జవానును విడుదల చేశారు
ఐదు రోజుల తర్వాత విడుదల చేసిన మావోయిస్టులు
బీజాపూర్: ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్ ఆ జవానును విడుదల చేశారు. దీంతో ఆయన బీజాపూర్లోని సీఆర్పీఎఫ్ శిబిరానికి చేరుకున్నారు. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దులో ఈ నెల 3న జరిగిన ఎన్కౌంటర్లో 28మంది భద్రతా సిబ్బంది మృతిచెందగా.. రాకేశ్వర్ సింగ్ను మావోయిస్టులు అపహరించిన విషయం తెలిసిందే. జవాను తమ వద్ద బందీగా ఉన్నట్లు ఈ నెల 5న లేఖ విడుదల చేసిన నక్సల్స్.. బుధవారం ఆయన ఫొటోను పత్రికలకు పంపించారు. ఓ పూరి గుడిసెలో జవాను క్షేమంగా ఉన్నట్లు అందులో కన్పించింది. తమ తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను కుమార్తె చేసిన విజ్ఞప్తిని మీడియా ద్వారా స్వీకరించామని మావోయిస్టులు నిన్న ప్రకటించారు.
రాకేశ్వర్ సింగ్ ఇంట్లో పండుగ వాతావరణం!
మరోవైపు, కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా విడుదల కావడంతో జమ్మూలోని ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు. దీంతో ఆయన ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. విడుదల సమాచారాన్ని ప్రసారమాధ్యమాల్లో తెలుసుకొని కుటుంబ సభ్యులు కేరింతలు కొట్టారు. మిఠాయిలు పంచారు. సీఆర్పీఎఫ్ అధికారులు కూడా ఆయన విడుదల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా విడుదలయ్యేందుకు కృషిచేసిన ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
రాకేశ్వర్ సింగ్ స్వస్థలం జమ్మూ. 210వ కోబ్రా దళంలో విధులు నిర్వహిస్తున్నారు. జవానును కిడ్నాప్ చేశారన్న వార్త తెలియగానే ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు లోనైంది. తన భర్తను ప్రాణాలతో విడిపించి ఆదుకోవాలని ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని జవాను భార్య కోరారు. తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను ఐదేళ్ల కుమార్తె శ్రాగ్వి కన్నీళ్లతో కోరింది. చిన్నారి ఫొటో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. రాకేశ్వర్ సోదరుడు గతంలో మెరుపుదాడి ఘటనలో చనిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం