parliament New building: పార్లమెంట్ భవనం ప్రారంభం.. అక్కడి పరిస్థితులను చూసి బాధపడ్డా: శరద్పవార్
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ( Parliament New Building) చూసిన తర్వాత అక్కడికి వెళ్లకపోవడమే మంచిదనిపించిందని ఎన్సీపీ అధినేత శరద్పవార్ (sharad Pawar) అన్నారు.
పుణె: పార్లమెంట్ నూతన భవనం (Parliament New Building) ప్రారంభోత్సవాన్ని మాధ్యమాల ద్వారా చూసిన తర్వాత చాలా బాధ కలిగిందని ఎన్సీపీ అధినేత శరద్పవార్ అన్నారు. దేశానికి తలమానికమైన నిర్మాణం.. కేవలం కొద్దిమందికే పరిమితమైనట్లు కనిపించిందని తెలిపారు. ‘‘ ఇవాళ ఉదయం పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవాన్ని టీవీలో చూశాను. ఆ తర్వాత అక్కడికి వెళ్లకపోవడమే మంచిదనిపించింది. అక్కడ పరిస్థితులను చూసి బాధపడ్డా. మన దేశం తిరోగమనం దిశగా పనియస్తోందా? ఈ కార్యక్రమం కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితం కావాలా?’’ అని శరద్పవర్ విమర్శించారు. భారత మాజీ ప్రధాని జవహార్లాల్ నెహ్రూ చెప్పిన సమాజ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం జరిగిందన్నారు.
‘‘ ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి అనుగుణంగా సమాజాన్ని నిర్మించాలన్నది మాజీ ప్రధాని నెహ్రూ ఆలోచన. కానీ ఇవాళ రాజధానిలో కార్యక్రమం దానికి వ్యతిరేకంగా జరిగింది. ఈ మహత్తర కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం ప్రభుత్వ బాధ్యత. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. కానీ, రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి ధన్కఢ్ అక్కడ లేరు. అందుకే ఈ కార్యక్రమం కేవలం కొందరు వ్యక్తుల కోసమే జరిగినట్లుగా కనిపిస్తోంది.’’ అని శరద్పవార్ విమర్శించారు.
ప్రజలకు, పాత పార్లమెంట్ భవనానికి మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పిన శరద్పవార్.. నూతన పార్లమెంట్ అంశంపై ప్రతిపక్షాలతో ఒక్కమాట కూడా చెప్పలేదని విమర్శించారు. ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే కూడా ఈ కార్యక్రమంపై స్పందించారు. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభం.. అసంపూర్తిగా జరిగిందన్నారు. ‘‘ ప్రతిపక్షాలు లేకుండా పార్లమెంట్ భవనం ప్రారంభిస్తే అది పూర్తయినట్లు కాదు. దీనిని బట్టి దేశంలో ప్రజాస్వామ్యం లేనట్లే కనిపిస్తోంది’’ అని సుప్రియా సూలే పుణెలో వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి