భారత్ చైనాను మించిపోవాలి: మోహన్ భగవత్
శక్తిసామర్థ్యాల పరంగా చైనాను భారత్ మించిపోవాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భవగవత్ అన్నారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు విస్తరణ కాంక్షతో ప్రస్తుత చైనాలాగే వ్యవహరిస్తున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని మరింత జాగ్రత...
నాగ్పూర్: శక్తిసామర్థ్యాల పరంగా చైనాను భారత్ మించిపోవాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భవగవత్ అన్నారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు విస్తరణ కాంక్షతో ప్రస్తుత చైనాలాగే వ్యవహరిస్తున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని మరింత జాగ్రతగా ఉండాలని కోరారు. విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ వార్షిక ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా వైరస్ నిబంధనల నేపథ్యంలో కేవలం 50 మంది స్వయంసేవక్లు మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘‘ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై భారత్ అంత తొందరగా స్పందిస్తుందని చైనా ఊహించి ఉండదు. భారత్ స్పందనకు చైనా కంగుతిన్నది. శక్తి సామర్థ్యాల పరంగా చైనాను భారత్ మించిపోవాల్సిన అవసరముంది. కరోనా విపత్కర సమయంలో భారత్లోకి చొరబడేందుకు చైనా యత్నించింది. చైనా విస్తరణ కాంక్ష గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని మోహన్ భగవత్ అన్నారు. భారత్ అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగాలని భావిస్తోందని అన్నారు. అది తమ స్వభావమని, అయితే భారత్ మంచితనాన్ని బలహీనతగా భావించి విడగొట్టాలని యత్నించడం, ఆక్రమణలకు ప్రయత్నించడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఒకవేళ అలా చేస్తే ప్రస్తుత పరిణామాలే ఎదురవుతాయని పరోక్షంగా చైనాను హెచ్చరించారు.
కొందరు సీసీఏ చట్టంపై మాట్లాడుతున్నారని చెబుతూ.. అది కేవలం ఏదో ఒక మతాన్ని ప్రభావితం చేసేది కాదన్నారు. కొందరు కావాలనే ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. దీనిపై చర్చించే బదులు దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న కరోనా వ్యాప్తిని ఎలా నివారించాలన్నదానిపై మాట్లాడుకుంటే ఉపయోగముంటుందని హితవు పలికారు. కరోనా వైరస్కు భయపడాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా వ్యవహరించాలని మోహన్ భగవత్ అన్నారు. పరిశుభ్రత పాటిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారని చెబుతూ.. వివిధ ప్రాంతాల్లో ఉపాధి కల్పన దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.