India Vaccination: జూన్లో 12కోట్ల డోసులు..!
జూన్ నెలలోనే 12కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉండనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
వీటిలో 6 కోట్ల డోసులు ఉచితం - కేంద్రం వెల్లడి
దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించింది. కేవలం జూన్ నెలలోనే 12కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రస్తుత మే నెలలో 7.9కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉండగా.. జూన్లో ఈ సంఖ్య 12కోట్లకు పెరగనుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
45ఏళ్ల వయసుపైబడిన వారితో పాటు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించడంలో భాగంగా జూన్ నెలలో 6.09కోట్ల డోసులను అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగానే సరఫరా చేస్తాం. వీటికి అదనంగా.. మరో 5.86కోట్ల డోసులు రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు సేకరించుకునేందుకు అందుబాటులో ఉంటాయి. దీంతో దేశవ్యాప్తంగా జూన్ మొత్తంలో దాదాపు 12కోట్ల (11,95,70,000) డోసులు అందుబాటులో ఉంటాయి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిని సరఫరా చేసే సమయాన్ని ఆయా రాష్ట్రాలకు తెలియజేస్తామని పేర్కొంది.
‘దేశంలో కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన జూన్ నెలలో అందుబాటులో ఉండే డోసుల సమాచారాన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ముందుగానే తెలియజేస్తున్నాం. తద్వారా వ్యాక్సిన్ సేకరణ, పంపిణీకి ఆయా రాష్ట్రాలు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకునే వెసులుబాటు కలుగుతుంది’ అని అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సిన్ పంపిణీ, జనాభా, డోసుల వృథాను పరిగణలోకి తీసుకొని ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తున్నామని తెలిపింది. ’అందుచేత వ్యాక్సిన్ను హేతుబద్ధంగా వినియోగించడంతోపాటు వ్యాక్సిన్ వృథాను అరికట్టేవిధంగా ఆయా రాష్ట్రాలు అధికారులకు సూచించాలని కేంద్రం విజ్ఞప్తిచేసింది.
ఇక మే నెలలో ఆయా రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు దాదాపు 3.9కోట్ల డోసులను సమీకరించుకోగా.. కేంద్ర ప్రభుత్వం 4.03కోట్ల డోసులను రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేసింది. దీంతో మే నెలలో దాదాపు 7.9కోట్ల డోసులను పంపిణీ చేస్తుండగా.. జూన్ నెలలో ఈ సంఖ్య 12కోట్లకు పెరగనుంది. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 21కోట్ల 20లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.