NEET PG: ఆ వార్తలు నమ్మొద్దు.. నీట్‌ పీజీ పరీక్ష వాయిదా లేదు

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల కోసం నిర్వహించాల్సిన ‘నీట్‌ పీజీ ప్రవేశ 2022’పై ఓ తప్పుడు సమాచారం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ పరీక్షను జులై 9వ తేదీకి

Published : 07 May 2022 16:06 IST

దిల్లీ: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల కోసం నిర్వహించాల్సిన ‘నీట్‌ పీజీ ప్రవేశ 2022’పై ఓ తప్పుడు సమాచారం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ పరీక్షను జులై 9వ తేదీకి వాయిదా వేశారంటూ నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పేరుతో ఓ నకిలీ సర్క్యులర్‌ బయటికొచ్చింది. ఇది వైరల్‌ అవడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. అవన్నీ తప్పుడు వార్తలని  తెలిపింది. నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేసింది.

నిజానికి ఈ పరీక్ష ఈ ఏడాది మార్చి 12వ తేదీనే జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల దృష్ట్యా మే 21వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఈ పరీక్షను మరోసారి వాయిదా వేయాలంటూ గత కొన్నిరోజులుగా విద్యార్థుల నుంచి అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. దీనిపై కొందరు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు.

ఈ నేపథ్యంలో పరీక్ష వాయిదాకు సంబంధించి ఓ సర్క్యులర్‌ తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. ఏప్రిల్‌ 28వ తేదీన నేషన్‌ బోర్డ్ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పేరుతో ఉన్న ఆ సర్క్యులర్‌లో పరీక్షను జులై 9వ తేదీకి వాయిదా వేసినట్లుగా ఉంది. ఇది కాస్తా అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ దీనిపై ఫ్యాక్ట్‌చెక్‌ చేసింది. ఆ సర్క్యులర్‌ నకిలీదని, దాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విటర్‌లో వెల్లడించింది. నీట్ పీజీ పరీక్షలో మార్పేమీ లేదని, మే 21వ తేదీనే జరుగుతుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని