కుంభమేళా: కరోనా టెస్టులు తప్పనిసరి
కుంభమేళాకు తరలి వచ్చే భక్తులు తప్పనిసరిగా నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టులు తీసుకురావాలని కేంద్రం తెలిపింది. ప్రభుత్వం సోమవారం కుంభమేళాలో పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్వోపీ)ని విడుదల చేసింది.
కుంభమేళా ఎస్వోపీ విడుదల చేసిన కేంద్రం
హరిద్వార్: కుంభమేళాకు తరలి వచ్చే భక్తులు తప్పనిసరిగా నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టులు తీసుకురావాలని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వం సోమవారం కుంభమేళాలో పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్వోపీ)ని విడుదల చేసింది. కుంభమేళాకు రానున్న భక్తులు హరిద్వార్కు చేరుకొనే 72గంటల్లోపు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకొని రావాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇప్పటివరకూ వ్యాక్సిన్ వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది మాత్రమే ఈ కుంభమేళాలో పాల్గొంటారని వారు తెలిపారు. వీలైనంత వరకూ ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. కుంభమేళాకు వెళ్లే అన్ని మార్గాల్లో మాస్కులను పంపిణీ చేస్తామన్నారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
65ఏళ్లకు పైబడినవారు, చిన్నారులు, గర్భిణులకు కుంభమేళాకు అనుమతి లేదన్నారు. కుంభమేళా నిర్వాహకులు ఎప్పటి కప్పుడు శానిటైజ్ చేస్తూ పర్యవేక్షిస్తారని వారు తెలిపారు. నిర్వాహకులు ఇప్పటికే 1,000 మంచాలతో కూడిన తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. అంబులెన్సులు ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఈ కుంభమేళా జరగనుంది. సాధారణ రోజుల్లో 10లక్షల మంది, ప్రత్యేక రోజుల్లో 50లక్షల మంది వరకూ పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?