Airbags in Car: ఇక కారులో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి..!
ప్రమాద సమయంలో కార్లలో ఎయిర్బ్యాగులు ఉన్నట్లయితే కేవలం ఒక్క ఏడాదిలోనే 13వేల ప్రాణాలను కాపాడి ఉండేవాళ్లమని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలు
దిల్లీ: ప్రమాద సమయంలో కార్లలో ఎయిర్బ్యాగులు ఉన్నట్లయితే కేవలం ఒక్క ఏడాదిలోనే 13వేల ప్రాణాలను కాపాడి ఉండేవాళ్లమని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అయితే, ఇటువంటి ప్రమాదాలను నివారించడంతోపాటు వాహనదారుల భద్రత కోసం కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా వాహనంలో మొత్తం ఆరు ఎయిర్బ్యాగులు (సైడ్ ఎయిర్బ్యాగులతో సహా) అమర్చేలా ప్రతిపాదనలు చేశామన్నారు. ఇప్పటికే వీటిని రవాణాశాఖ నోటిఫై చేసిందన్న ఆయన.. అక్టోబర్ 1 నుంచి నిబంధనలు అమలులోకి వస్తాయని అన్నారు.
‘ప్రతిఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా వాటిలో లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2020లో మొత్తం 25,289 ప్రమాదాలు చోటుచేసుకోగా.. వాటిలో 30శాతం మంది తలకు గాయాల కారణంగానే మరణించారు. ఒకవేళ ఎయిర్బ్యాగులు ఉన్నట్లయితే 8598 మంది ప్రాణాలు కాపాడుకునేవాళ్లం. అదేవిధంగా ఇరువైపుల తలుపులను ఢీకొట్టడం వల్ల 14వేల మంది చనిపోగా.. సైడ్ ఎయిర్బ్యాగులు ఉంటే 4424 మందిని రక్షించుకునేవాళ్లం. అందుకే మరిన్ని నిబంధనలు తీసుకొస్తున్నాం. ఇక నుంచి ఆరు ఎయిర్బ్యాగులు తప్పనిసరి. సాధారణ మోడళ్లకు (Economy Model) కూడా దీన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించాం’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అయితే, ప్రజల ప్రాణాలకు కాపాడుకోవడంలో భాగంగా వాహన రంగంలో రేటింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ తరహా విధానం వల్ల ఆటోమొబైల్ రంగంలో గుణాత్మక మార్పులు రావడంతోపాటు ఉపాధి అవకాశాలు, ఎగుమతుల్లో వృద్ధి వంటి మెరుగవుతుందన్నారు.
ఇదిలాఉంటే, కారు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ ఆరు ఎయిర్బ్యాగ్లను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఎప్పటినుంచో యోచిస్తోంది. ఇందులో భాగంగా ఎకానమీ మోడళ్లతో సహా కొత్తగా వచ్చే అన్ని వాహనాలకు ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. 2022 జనవరి 1 నుంచి అన్ని కార్లలో 2 ఎయిర్బ్యాగ్ల (డ్రైవరు, ముందు సీటు ప్రయాణికునికి) ఏర్పాటు తప్పనిసరి చేసిన కేంద్ర రవాణాశాఖ.. వెనుక కూర్చున్న వారికీ భద్రత కల్పించేలా మరో 4 ఎయిర్ బ్యాగ్లు కూడా (మొత్తం 6 అవుతాయి) తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. కొద్దిపాటి అదనపు వ్యయం వల్ల కారులో అందరు ప్రయాణికులకు భద్రత పెరుగుతుందని భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.