ఫ్రాన్స్‌కు పాకిన కొత్తరకం కరోనా!

కరోనా కొత్త రకం తాజాగా ఫ్రాన్స్‌కు పాకింది. శుక్రవారం అక్కడ తొలి కొత్త రకం కరోనా వైరస్‌ కేసు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. బాధితుడు డిసెంబరు 19న బ్రిటన్‌ నుంచి తిరిగొచ్చినట్లు తెలిపారు.......

Published : 26 Dec 2020 09:34 IST

ప్యారిస్‌: కరోనా కొత్త రకం తాజాగా ఫ్రాన్స్‌కు పాకింది. శుక్రవారం అక్కడ తొలి కేసు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. బాధితుడు డిసెంబరు 19న బ్రిటన్‌ నుంచి తిరిగొచ్చినట్లు తెలిపారు. డిసెంబరు 21న పరీక్షలు జరపగా.. పాజిటివ్‌ అని తేలడంతో నిర్బంధంలో ఉంచారు. తదుపరి పరీక్షలు చేయగా.. అది కొత్త రకం వైరస్‌ అని నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇటీవల బాధితుడు కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. బ్రిటన్‌లో వైరస్ వెలుగులోకి రాగానే అప్రమత్తమైన ఫ్రాన్స్‌ అక్కడి నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. కానీ, సొంత దేశం వారు తిరిగొచ్చేందుకు వీలుగా కొంత వెసులుబాటు కల్పించింది. అలాగే సరకుల రవాణాకు సైతం పచ్చజెండా ఊపింది. కానీ, కరోనా నిర్ధారణ పరీక్షలను తప్పనిసరి చేసింది.

దక్షిణాఫ్రికాలో ఉత్పరివర్తనానికి గురైన ఈ కొత్త వైరస్‌ అక్కడి నుంచి ఓ ప్రయాణికుడి ద్వారా బ్రిటన్‌కు చేరింది. అక్కడ భారీ స్థాయిలో కేసులు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా మళ్లీ నిషేదాజ్ఞలు విధించింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఇక ఇటలీలోనూ ఓ వ్యక్తిలో ఈ వైరస్‌ను గుర్తించారు. డెన్మార్క్‌లోనూ ఏడుగురికి కొత్త రకం వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అలాగే నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియాలోనూ ఒక్కో కేసు నమోదైంది.

ఇవీ చదవండి..

యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులు

బ్రిటన్‌ ప్రయాణికుల్లో 16 మందికి కొవిడ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని