ప్రపంచాన్ని చుట్టేస్తున్న కొత్త రకం!
సరిగ్గా కరోనా మహమ్మారి అంతానికి ముహూర్తం కుదిరిన వేళ.. కొత్తగా మరో రకం పుట్టుకొచ్చింది. చూస్తుండగానే 30 దేశాలకు పాకిపోయింది. తొలి వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాల్ని మరోసారి కలవరానికి గురిచేస్తుంది........
30 దేశాలకు పాకిన నూతన వేరియంట్
ఇంటర్నెట్డెస్క్: కరోనా మహమ్మారి అంతానికి ముహూర్తం కుదిరిన వేళ.. కొత్తగా మరో రకం పుట్టుకొచ్చింది. చూస్తుండగానే 30 దేశాలకు పాకిపోయింది. తొలి వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాల్ని మరోసారి కలవరానికి గురిచేస్తోంది. రోజుకో దేశంలో ఈ రకం వెలుగులోకి వస్తూనే ఉంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. కొత్త వైరస్ ప్రపంచ దేశాల్ని చుట్టేస్తోంది. దీంతో దాదాపు అన్ని దేశాలు దీని కట్టడికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. తొలి వైరస్ వ్యాప్తి నివారణలో వేసిన తప్పటడుగులను గుర్తుంచుకొని వ్యవహరిస్తున్నాయి. విమాన రాకపోకలపై ఆంక్షలు, అవసమైన చోట లాక్డౌన్లు విధించడంలో వేగంగా స్పందించాయి.
ఇప్పటి వరకు ఈ మహమ్మారి 30 దేశాల్లో వెలుగు చూసింది. తాజాగా వియత్నాంతో శనివారం తొలి కేసు నమోదైంది. ఇటీవల యూకే నుంచి తిరిగొచ్చిన ఓ మహిళలో ఈ కొత్త రకం వైరస్ను గుర్తించారు. వెంటనే ఆమెను ఐసోలేషన్కు తరలించారు. వియత్నాం ఇప్పటికే అన్ని అంతర్జాతీయ విమాన రాకపోకల్ని నిషేధించింది. యూకే నుంచి వచ్చే తమవారి కోసం మాత్రమే ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతోంది. అంతకుముందు శుక్రవారం టర్కీలో ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. వీరంతా యూకే నుంచి తిరిగొచ్చిన వారిగా గుర్తించారు. దీంతో అక్కడి ప్రభుత్వం కూడా అంతర్జాతీయ విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇదే తరహాలో చాలా దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించాయి. భారత్లో ఇప్పటి వరకు 29 కేసులు నిర్ధారణ కాగా.. విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇక అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వైరస్ అమెరికాలో భారీగా వ్యాపించి ఉంటుందని అక్కడి వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. జన్యుక్రమ విశ్లేషణ పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండడంతో గుర్తించలేకపోతున్నామని వెల్లడించారు. ఇప్పటికే కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికాలో ఈ కొత్త రకం మరింత కల్లోలం సృష్టించే ప్రమాదం ఉందన్న భయాందోళన వ్యక్తమవుతోంది. కరోనా రోగులతో ఇప్పటికే నిండిపోయిన అక్కడి ఆస్పత్రులకు ఇది పెనుసవాల్గా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
ఇక కొత్తరకానికి కేంద్రంగా ఉన్న బ్రిటన్లో లాక్డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు యంత్రాంగాలు సిద్ధమయ్యాయి. స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్లిక్ పార్క్లు పూర్తిగా మూసివేయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు కాస్త తక్కువ వ్యాప్తి ఉన్న ఐర్లాండ్లోనూ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి వైరస్ ముప్పు పొంచి ఉందని అక్కడి హెల్త్ సర్వీసెస్ సీఈవో పాల్ రేడ్ తెలిపారు.
మరోవైపు వివిధ దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు పదిలక్షల మందికి పైగా వ్యాక్సిన్ను అందజేశారు. ఇక అమెరికాలో ఇప్పటి వరకు 4,225,756 మందికి టీకా అందించినట్లు సీడీసీ వెల్లడించింది. కొత్త వైరస్నూ ఈ వ్యాక్సిన్లు కట్టడి చేస్తాయని భావిస్తున్నప్పటికీ.. అందరికీ టీకా అందేందుకు ఇంకా కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త రకం ప్రపంచాన్ని చుట్టేసి మరో విడత విజృంభణకు కారణమయ్యే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం