కొత్త సంవత్సరం వేళ..మూగబోయిన ప్రపంచం..!
ఓవైపు కరోనా వైరస్పై ఆందోళన.. మరోవైపు ప్రభుత్వాల ఆంక్షల నడుమ నిరాడంబరంగానే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వివిధ దేశాల ప్రజలు సిద్ధమయ్యారు.
కాన్బెర్రా: కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు యావత్ ప్రపంచం నూతన ఉత్సాహంతో పండుగ చేసుకుంటుంది. ప్రపంచ దేశాలు కలిసి చేసుకునే ఒకే ఒక్క ఉత్సవం ఏదైనా ఉందంటే అది కేవలం నూతన సంవత్సరమనే చెప్పవచ్చు. గడిచిన సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. బాణసంచా, కేరింతలు, నృత్యాలతో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే అలవాటు ప్రపంచీకరణ నేపథ్యంలో కొన్నేళ్లుగా మరింత పెరిగింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఈసారి మాత్రం ప్రపంచ దేశాలు కొత్త ఏడాది ఉత్సవాలకు దూరంగా ఉండనున్నాయి. ఓవైపు కరోనా వైరస్పై ఆందోళన.. మరోవైపు ప్రభుత్వాల ఆంక్షల నడుమ నిరాడంబరంగానే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వివిధ దేశాల ప్రజలు సిద్ధమయ్యారు.
ఆస్ట్రేలియా.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే దేశాల్లో ఆస్ట్రేలియా ముందుండే విషయం తెలిసిందే. ప్రతి ఏటా నూతన సంవత్సరానికి స్వాగతం పలికే కార్యక్రమాలను ఇక్కడ భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసే అతిపెద్ద ఫైర్వర్క్స్ కార్యక్రమంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారని అంచనా. అలాంటి భారీ వేడుకలను వీక్షించడానికి యావత్ ప్రపంచం నుంచి పర్యటకులు ఆసక్తి చూపిస్తారంటే అతిశయోక్తి కాదు. కానీ, ఈసారి మాత్రం కరోనా ప్రభావంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లక్షల మంది పాల్గొనాల్సిన సిడ్నీ హార్బర్ మూగబోనుంది. ఈసారి భారీ బాణసంచా ప్రదర్శన ఏర్పాటు చేయడం లేదని సిడ్నీ అధికారులు ప్రకటించారు. తక్కువ స్థాయిలో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమాన్ని నేరుగా వీక్షించే అవకాశం లేదని.. కేవలం టీవీల్లో మాత్రమే చూడాలని సూచించారు. కేవలం హార్బర్కు చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్ల నుంచి మాత్రమే నేరుగా చూసే అవకాశం ఉంది. గతకొన్నిరోజులుగా సిడ్నీ నగరంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంలోనే ఈ ఆంక్షలు విధించినట్లు అధికారులు వెల్లడించారు.
మెల్బోర్న్.. ఇక ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న మెల్బోర్న్లోనూ నూతన సంవత్సర ఫైర్వర్క్స్ కార్యక్రమాలను రద్దు చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఫైర్వర్క్స్ రద్దు చేశామని.. తప్పని పరిస్థితుల్లోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మెల్బోర్న్ మేయర్ సాలీ క్యాప్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ ప్రతిఏటా ఏర్పాటు చేసే ఫైర్వర్క్స్ కార్యక్రమంలో దాదాపు నాలుగున్నర నుంచి 5లక్షల మంది పాల్గొంటారని అంచనా.
న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాకు సమీప దేశమైన న్యూజిలాండ్లోనూ ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను రద్దు చేశారు. అయితే, ఇక్కడ కరోనా వైరస్ తీవ్రత కాస్త అదుపులోనే ఉందనే చెప్పవచ్చు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా భారీస్థాయిలో వేడుకల నిర్వహణకు దూరంగా ఉంది.
దక్షిణ కొరియా.. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నందున దక్షిణ కొరియాలోనూ కొత్త సంవత్సర వేడుకలను అక్కడి ప్రభుత్వం రద్దుచేసింది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఏర్పాటుచేసే ‘బెల్ రింగింగ్’ కార్యక్రమాన్ని కూడా 1953 తర్వాత తొలిసారి రద్దుచేశారు. డిసెంబర్ రాత్రి 12గంటలు కాగానే అక్కడ ఉన్న గంటను మోగించడం కొరియన్ యుద్ధం ముగిసిన నాటినుంచి సంప్రదాయంగా వస్తోంది. ప్రతిఏటా ఈ కార్యక్రమంలో దాదాపు లక్షమంది పాల్గొనడంతో పాటు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ సారి మాత్రం కరోనా కారణంగా ఈ కార్యక్రమం రద్దయ్యింది. వీటితో పాటు మరిన్ని నూతన సంవత్సర వేడుకలపై కూడా దక్షిణకొరియా ఆంక్షలు విధించింది.
జపాన్.. కొత్త సంవత్సరం వేళ జపాన్లోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడ డిసెంబర్ 31 రాత్రి ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. నూతన సంవత్సరం సందర్భంగా లక్షల మంది సందర్శించే టోక్యోలోని మైజీ సందర్శన ప్రదేశాన్ని కూడా ఈ సాయంత్రానికే మూసివేయనున్నారు. అంతేకాకుండా ప్రధాన నగరాల్లో ఈ అర్థరాత్రి మెట్రో సేవలను కూడా రద్దుచేశారు.
చైనాలోనూ.. కరోనా వైరస్కు కారణమైన చైనాలోనూ ఈ సారి కొత్త సంవత్సరం వేడుకలు నిరాడంబరంగానే జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, జనవరి 1 కంటే ఎక్కువగా ఫిబ్రవరిలో చైనా జరుపుకునే కొత్త సంవత్సర వేడుకలను భారీ స్థాయిలో నిర్వహిస్తారు. వీటిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడమే కాకుండా గతకొన్ని దశాబ్దాలుగా అక్కడ హాలిడే కల్చర్ కూడా కొనసాగుతోంది. అయితే, ఈసారి మాత్రం చాలావరకు కొత్త సంవత్సర వేడుకలు మునుపటిలా ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
బీజింగ్.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ‘కౌంట్డౌన్’ కార్యక్రమంలో ఈసారి కేవలం కొద్దిమందికే అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నగరంలో జరిగే ఇతర నూతన సంవత్సర వేడుకలను దాదాపు రద్దు చేశారు. వీటికితోడు రాత్రిపూట ఉష్ణోగ్రతలు మైనస్ 15డిగ్రీల సెల్సియస్ నమోదవుతుండడం కూడా ప్రజలు ఈ వేడుకలకు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే, ఫిబ్రవరిలో జరిగే చైనా కొత్త సంవత్సర వేడుకల నాటికే చైనాలో దాదాపు 5కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేందుకు చైనా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
హాంగ్కాంగ్.. కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకొనే ప్రాంతాల్లో హాంగ్కాంగ్ కూడా ఒకటనే చెప్పవచ్చు. ప్రతిఏటా భారీస్థాయిలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తుంటారు. అయితే, గతకొంత కాలంగా అక్కడ జరుగుతోన్న ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో గత ఏడాది అక్కడ కొత్త సంవత్సర వేడుకలను రద్దుచేశారు. ఈసారి మాత్రం కరోనా వైరస్ కారణంగా నూతన సంవత్సర సందర్భంగా ఏర్పాటుచేసే ఫైర్వర్క్స్ కార్యక్రమాలను రద్దుచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే అక్కడ భౌతిక దూరం ఆంక్షలు కొనసాగుతున్నాయి. కేవలం ఇద్దరికంటే ఎక్కువ మంది ప్రజలు గుమికూడకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
తైవాన్..మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉన్నా.. నూతన సంవత్సర వేడుకలను నిర్వహించేందుకు తైవాన్ సిద్ధమైంది. ఎందుకంటే కరోనా వైరస్ మహమ్మారిని జయించిన అతికొద్ది దేశాల్లో తైవాన్ ముందుందనే చెప్పవచ్చు. కేవలం ఇక్కడ ఇప్పటివరకు 700పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడగా, వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ సారి ఫైర్వర్స్క్ను యథావిథిగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఐకానిక్ టవర్గా పిలిచే తైపీ-101 వద్ద ఫైర్వర్క్స్ను నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే, మరిన్ని ఆసియా, యూరప్, అమెరికా దేశాల్లోనూ నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ దృష్ట్యా పరిమిత స్థాయిలోనే వేడుకలను నిర్వహించుకునేందుకు ఆయా దేశాలు అనుమతులు ఇస్తున్నాయి. ఏదేమైనా, యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టి, ఎన్నోసవాళ్లను చూపిన 2020కి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరంలోనైనా వీటినుంచి బయటపడుతామని ఆశతో యావత్ ప్రపంచం స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తోంది.
ఇవీ చదవండి..
దిల్లీలో కొత్త సంవత్సర వేడుకలకు చెక్
జనవరి నుంచి వచ్చే మార్పులివీ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్