New Year 2022: అక్కడ న్యూఇయర్ వచ్చేసింది.. 2022లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్
కరోనా కల్లోల పరిస్థితుల్లోనే కాలచక్రం మరో ఏడాది గిర్రున తిరిగింది. మరికొద్ది గంటల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే మనకంటే ముందే కొన్ని
కొత్త సంవత్సరాన్ని మొట్టమొదట ఆహ్వానించిన సమోవా, టోంగా
ఇంటర్నెట్డెస్క్: కరోనా కల్లోల పరిస్థితుల్లోనే కాలచక్రం మరో ఏడాది గిర్రున తిరిగింది. మరికొద్ది గంటల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే మనకంటే ముందే కొన్ని ప్రాంతాలు కొత్త ఏడాదిని ఆహ్వానించాయి. పసిఫిక్ మహా సముద్రంలోని ‘సమోవా’ ద్వీపం ప్రపంచంలోనే అందరికంటే ముందుగా 2022లోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ నూతన సంవత్సరం వచ్చేసింది. కాసేపటికే టోంగా, కిరిబాటి దీవులు కూడా కొత్త ఏడాదిని స్వాగతించాయి.
న్యూజిలాండ్లో మొదలైన కొత్త ఏడాది
న్యూజిలాండ్ వాసులు కూడా 2022లోకి అడుగుపెట్టారు. భారత్లో కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆ దేశం కొత్త ఏడాదిని స్వాగతించింది. ఆనందోత్సాహాల మధ్య కివీస్ ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాయి. ఆక్లాండ్ స్కైటైవర్ వద్ద న్యూఇయర్ వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. బాణసంచా వెలుగులతో స్కైటవర్ వద్ద సంబరాలు అంబరాన్నంటాయి.
ఏయే దేశాల్లో ఎప్పుడు..
* ఆస్ట్రేలియాలో మనకంటే అయిదున్నర గంటల ముందు నూతన సంవత్సరం మొదలవుతుంది.
* ఇక సూర్యోదయ భూమిగా పేరున్న జపాన్ కూడా మూడున్నర గంటల ముందే 2022లోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. భారత్ పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెళ్తాయి.
ఒకేసారి 43 దేశాల్లో..
సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు మనం 2022లోకి అడుగుపెడతాం. అదే సమయానికి భారత్తో పాటు శ్రీలంకలోనూ జనవరి ఒకటి వస్తుంది. ఇక మన తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతో పాటు కాంగో, అంగోలా, కామెరూన్ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.
చివరగా అక్కడే..
భారత్ తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లండ్లో న్యూఇయర్ మొదలవుతుంది. మనకు జనవరి 1 ఉదయం 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది. ఇక కొత్త సంవత్సరం ఆఖరిగా వచ్చే భూభాగాలు అమెరికా పరిధిలోని బేకర్, హోవార్డ్ దీవులు. అయితే ఇక్కడ జనావాసాలు లేకపోవడంతో అమెరికన్ సమోవాను చివరిదిగా పరిగణిస్తారు.
ఇవి ప్రత్యేకం..
రష్యాలో నూతన సంవత్సర వేడుకలను రెండు సార్లు జరుపుకొంటారు. ఒకటి జనవరి 1 (కొత్త క్యాలెండర్ ప్రకారం). రెండోది జనవరి 14 (పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం). ఇక నూతన సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోని దేశాల్లో చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం ఉన్నాయి. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ న్యూఇయర్ వేడుకలు జరుగుతాయి.
వేడుకలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్..
గతేడాదిలాగే ఈసారి కూడా నూతన సంవత్సర వేడుకలపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. ఇటీవలే పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. దీంతో ఇప్పటికే అనేక దేశాలు మళ్లీ ఆంక్షల బాట పట్టాయి. దీంతో ఈసారి కూడా కొత్త సంవత్సరాన్ని నిరాడంబరంగానే ఆహ్వానించాల్సిన పరిస్థితి తలెత్తింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!