Indian Railway: వాళ్లంతా పదేళ్లు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిందే: రైల్వే బోర్డు
యూపీఎస్సీ (USPS) ద్వారా రైల్వే గ్రూప్ A స్థాయిలో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారంతా తొలి 10 ఏళ్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసింది.
దిల్లీ: రైల్వే బోర్డు (Railway Board) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వేలో కొత్తగా నియమితులైన గ్రూప్ A (Group A Employees) ఉద్యోగులంతా కనీసం 10 ఏళ్లపాటు క్షేత్రస్థాయిలో పని చేయాలని, ఆ తర్వాతే ప్రధాన కార్యాలయం (Head Quarters)లో పని చేసేందుకు అర్హులవుతారని పేర్కొంది. ఈ మేరకు రైల్వే నిబంధనల్లో మార్పులు చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కూడా రైల్వే ప్రధాన కార్యాలయంలో పని చేసేందుకు వీలుంది. కానీ, క్షేత్రస్థాయిలో పని చేసిన అనుభవాన్ని పొందేందుకే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
‘‘ నేరుగా ఉద్యోగంలో చేరిన గ్రూప్ -A స్థాయి ఉద్యోగులు క్షేత్రస్థాయిలో తగినంత అనుభవం సాధించేందుకు మొదటి 10 సంవత్సరాల సర్వీను క్షేత్ర స్థాయిలోనే పూర్తి చేయాలి. ఆ తర్వాతే ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం పొందేందుకు అర్హత సాధిస్తారు’’ అని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఓ అవగాహన ఉంటే.. తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయని సీనియర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. ‘‘క్షేత్ర స్థాయిలో పని చేయడం వల్ల ప్రాథమిక స్థాయిలో ఏం జరుగుతుందనేది వాళ్లకు తెలుస్తుంది.’’ అని ఆయన అన్నారు.
ఇటీవల నల్గొండ జిల్లా బీబీనగర్ సమీపంలో రైలు పట్టాలు తప్పిన తర్వాత జరిగిన సమావేశంలో రైల్వే బోర్డు ఛైర్మన్ ఏకే లహోటి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న జనరల్మేనేజర్లు, డివిజినల్ మేనేజర్లు స్వయంగా ప్రమాద స్థలానికి వెళ్లి పరిష్కారాలను కనుగొనాలని చెప్పిన సంగతి తెలిసిందే.‘‘ క్షేత్రస్థాయిలో పని చేయడం చాలా శ్రమతో కూడుకున్నది. సంస్థకు కూడా క్షేత్రస్థాయిలో పని చేసే వారి అవసరం ఉంది.యువ అధికారులు అక్కడ పని చేస్తే సవాళ్లను ఎదుర్కోవడం మరింత సులువవుతుంది. అందుకే రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు’’ అని మరో సీనియర్ అధికారి తెలిపారు.
మరోవైపు అత్యవసర సందర్భాల్లో జనరల్మేనేజర్ స్థాయి అధికారి ఆమోదంతోనే ఒక ఉద్యోగి ప్రధాన కార్యాలయంలో పని చేసేందుకు వీలుందని ఫిబ్రవరి 21న జారీ చేసిన ఉత్తర్వులోనూ రైల్వేబోర్డు పేర్కొంది. రైళ్ల రాకపోకల నుంచి, విధానాల రూపకల్పన వరకు, సాంకేతిక అంశాల నుంచి ఆదాయం వరకు మొత్తం యాంత్రాంగాన్ని గ్రూప్- A ఉద్యోగులే పర్యవేక్షిస్తారు. వీరందర్నీ యూపీఎస్సీ ద్వారా నియమిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు