Newsclick: న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టు
Newsclick: న్యూస్క్లిక్ ఆన్లైన్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
దిల్లీ: న్యూస్క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ న్యూస్ పోర్టల్కు విదేశీ నిధులపై దర్యాప్తు నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు మరోవ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం ఉదయం 30చోట్ల జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఇప్పటివరకు ప్రబిర్ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్టు దిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా వెల్లడించారు. అయితే, అమిత్ చక్రవర్తికి ఈ కేసుతో సంబంధం ఏమిటనే వివరాలు మాత్రం ఇంకా పోలీసులు వెల్లడించలేదు.
‘న్యూస్క్లిక్’ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఈ ఏడాది ఆగస్టులో ‘న్యూయార్క్ టైమ్స్’లో కథనం ప్రచురితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నెవిల్ రాయ్సింగం నుంచి గ్లోబల్ నెట్వర్క్లో భాగంగా ఉన్న న్యూస్క్లిక్ నిధులు పొందినట్టు ఆ కథనంలో పేర్కొంది. దీంతో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన దిల్లీ పోలీసులు.. మంగళవారం ఉదయం న్యూస్క్లిక్ ఆఫీస్తో పాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లు సహా మొత్తం 30 చోట్ల సోదాలు జరిపారు. ఈ సందర్భంగా పోలీసు బలగాలను మోహరించారు.
పోలీసుల తీరుపై విమర్శలు..
మరోవైపు, ‘న్యూస్క్లిక్’తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, రచయితల ఇళ్లపై దిల్లీ పోలీసులు దాడులు చేయడంపై ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. తాము ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని.. వివరణాత్మక ప్రకటన విడుదల చేస్తామంటూ ట్వీట్ చేసింది. ‘న్యూస్క్లిక్’పై దాడులను విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడేవారి గళాన్ని అణచివేసేందుకే కేంద్రం సోదాలు చేపట్టిందని విమర్శించారు. బిహార్లో కులగణనలో బయటపడిన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేంద్రం న్యూస్క్లిక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని విపక్షాలు మండిపడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నియామకం విషయంలో కేంద్రంతో నెలకొన్న వివాదంలో దిల్లీలోని కేజ్రీవాల్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. -
విమానంలో భార్యాభర్తల గొడవ.. దారి మళ్లించి దిల్లీలో దించివేత
బ్యాంకాక్కు బయలుదేరిన మ్యూనిక్ - బ్యాంకాక్ ‘లుఫ్తాన్సా’ విమానాన్ని బుధవారం దారి మళ్లించి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు. -
విధానసౌధ వాకిట గజరాజులు
చారిత్రక బెంగళూరు విధానసౌధ ఆవరణలో అసలైన ఏనుగులను తలపించేలా గజరాజుల బొమ్మలు ఏర్పాటు చేశారు. -
గవర్నర్ ఏడీసీగా తొలిసారిగా మహిళ
దేశంలో గవర్నర్ ఏడీసీ (ఎయిడ్ ది క్యాంప్)గా తొలిసారి ఓ మహిళ నియమితులయ్యారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ 2015 బ్యాచ్కు చెందిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాఢిని తన ఏడీసీగా నియమిస్తూ మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం ఉత్తర్వులిచ్చారు. -
భారత్కు తిరిగొచ్చిన అంజూ
ఫేస్బుక్లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్కు వెళ్లి.. అక్కడే రెండోపెళ్లి చేసుకున్న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన వివాహిత అంజూ (34) తిరిగి భారత్కు వచ్చింది. -
81.35 కోట్ల మందికి అయిదేళ్లపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు
వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ల సాయం.. ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా గిరిజనుల అభివృద్ధి.. 81.35 కోట్ల మందికి ఐదేళ్లపాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ.. వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
భారత్లో అసాధారణ వాతావరణం
భారత్లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో సుమారు ప్రతిరోజు అసాధారణ వాతావరణ పరిణామాలు చోటుచేసుకున్నాయని బుధవారం తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. -
2026 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్ రైలు
అహ్మదాబాద్ - ముంబయి మార్గంలో అందుబాటులోకి రానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంతభాగం 2026 ఆగస్టు నాటికి సిద్ధం కానుందని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
మేం దిల్లీ వీడుతాం!
ముంబయి, దిల్లీ నగర వాసులను వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. దీని బారి నుంచి తప్పించుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లే యోచన కూడా చేస్తున్నారు. -
సంక్షిప్త వార్తలు
హిమాలయ ప్రాంత పర్యావరణ వ్యవస్థ సున్నితత్వం, సంక్లిష్టతలను సిల్క్యారా సొరంగ ప్రమాద ఘటన మన కళ్లకు కట్టింది. ఇక్కడి ప్రాజెక్టుల మదింపు ప్రక్రియ వైఫల్యం కూడా వెలుగులోకి వచ్చింది. -
సొరంగం నుంచి కుమారుడు బయటకు రావడానికి కొన్ని గంటల ముందే తండ్రి మరణం
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న తన కుమారుడి కోసం 16 రోజులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఓ తండ్రి.. చివరకు తన బిడ్డ బయటకు రావడానికి కొన్ని గంటల ముందు కన్నుమూసిన హృదయ విదారక ఘటన ఇది. -
చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్లో 6 రాష్ట్రాలు అప్రమత్తం
చైనాలో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల్లు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. -
గురుపత్వంత్ హత్యకు కుట్రపై దర్యాప్తునకు కమిటీ
సిక్స్ ఫర్ జస్టిస్’ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నును అమెరికా భూభాగంపై హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై విచారణకు ఓ ఉన్నతస్థాయి కమిటీని భారత్ ఏర్పాటు చేసింది. -
దిల్లీ విమానం ఆరున్నర గంటల ఆలస్యం
దిల్లీ విమాన సర్వీస్ ఆరున్నర గంటలు ఆలస్యంగా వెళ్లిన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం చోటు చేసుకుంది. -
16వ ఆర్థిక సంఘానికి శ్రీకారం
కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించిన విధి విధానాలకు ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. -
మణిపుర్లో శాంతి వీచిక
జాతుల ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్లో శాంతియుత పరిస్థితులకు కీలక ముందడుగు పడింది. -
గంటన్నరలో బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసు జాగిలం లియో
ముంబయిలో అపహరణకు గురైన ఆరేళ్ల బాలుడి జాడను పోలీసు జాగిలం ‘లియో’ కేవలం గంటన్నర వ్యవధిలో గుర్తించింది. -
కౌన్బనేగా కరోడ్పతిలో రూ.కోటి గెలుచుకున్న 14 ఏళ్ల బాలుడు
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (కేబీసీ)లో 14 ఏళ్ల బాలుడు ఏకంగా రూ.కోటి గెలుచుకొని రికార్డు సృష్టించాడు. -
విద్వేష ప్రసంగాలపై చర్యలకు ప్రత్యేక పాలనా యంత్రాంగం
దేశవ్యాప్తంగా విద్వేష ప్రసంగాల కట్టడికి పాలనా యంత్రాంగాన్ని నెలకొల్పే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించింది. -
పార్లమెంటు సమావేశాల్లో 18 బిల్లులు
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2 జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, 3 నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. -
రాష్ట్రపతికి బిల్లులను ఎప్పుడు పంపించాలి?
శాసనసభ ఆమోదించిన బిల్లులను రెండేళ్ల పాటు కేరళ గవర్నర్ తన వద్దే నిలిపి ఉంచడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి సమ్మతి కోసం గవర్నర్లు ఎప్పుడు బిల్లులను పంపించాలనే అంశంపై మార్గదర్శకాలను రూపొందించే విషయాన్ని పరిశీలించనున్నట్లు బుధవారం తెలిపింది.


తాజా వార్తలు (Latest News)
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..