‘అంబానీ ఇంటివద్ద వాహనం కేసు’ ఎన్‌ఐఏకి..

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ ఘటనలో

Published : 08 Mar 2021 21:06 IST

దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ ఘటనలో దర్యాప్తు బాధ్యతలు తీసుకున్నామని ఎన్‌ఐఏ అధికారిక ప్రతినిధి సోమవారం వెల్లడించారు. ఆ ఘటనపై మళ్లీ కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. అయితే వాహన యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ మృతి కేసును మాత్రం ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్‌) దర్యాప్తు చేయనుంది. 

దక్షిణ ముంబయిలోని అంబానీ ఇంటికి సమీపంలో ఫిబ్రవరి 25న జిలెటిన్‌ స్టిక్స్‌తో ఉన్న ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. ఆ వాహనంలో 20 జిలిటెన్‌ స్టిక్స్‌ ఉండటం కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ వాహనం తనదేనని, వారం రోజుల ముందే అది చోరీకి గురైనట్లు మన్‌సుఖ్‌ అనే వ్యక్తి పోలీసులకు చెప్పారు. దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. అనూహ్యంగా ఆయన చనిపోవడం గమనార్హం. గత శుక్రవారం ఠాణేలోని సముద్రపు ఒడ్డున మన్‌సుఖ్‌ శవమై కన్పించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని