Union Budget 2022: యూపీఏ హయాంలోనే దేశ ఆర్థికవ్యవస్థ బలహీనం..!
కేంద్ర వార్షిక బడ్జెట్పై కాంగ్రెస్ నేతలు చేస్తోన్న విమర్శలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు.
రాహుల్ విమర్శలకు ఘాటుగా స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మల
దిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్పై కాంగ్రెస్ నేతలు చేస్తోన్న విమర్శలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందించిన కేంద్ర మంత్రి.. బడ్జెట్ను అర్థం చేసుకోకుండా తొందరపాటులో అవగాహన లేని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వారు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి చూపించాలని నిర్మలా సీతారామన్ సూచించారు.
‘మాకు చెప్పే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అమలు చేసి చూపించాలి. పంజాబ్, ఛత్తీస్గఢ్ ఉద్యోగాల కల్పన ఏమైనా మెరుగ్గా ఉందా? మహారాష్ట్రలో పత్తి రైతుల ఆత్మహత్యలను ఆపగలిగారా? శతాబ్ద కాలంనాటి పార్టీకి చెందిన నేతగా ఆయన్ని అభినందిస్తా. కానీ, ఆయన విమర్శలు మాత్రం సరికాదు. ట్విటర్లో ఏదోఒకటి చెప్పాలనే తొందరడే వారిని చూస్తే జాలి కలుగుతోంది. బడ్జెట్ను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత విమర్శిస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రాహుల్ గాంధీ విమర్శలకు నిర్మలా సీతారామన్ బదులిచ్చారు.
యూపీఏ హయాంలోనే బలహీనం..
ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపైనా నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ను బలహీన ఆర్థిక వ్యవస్థగా (Fragile Five) చూపిన ఘనత కాంగ్రెస్దేనంటూ ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వ చర్యలతో ప్రస్తుతం అటువంటి స్థితి నుంచి బయటపడ్డామని అన్నారు. ఆర్థికవృద్ధి కోసం పూర్తిగా విదేశీ పెట్టుబడులపైనే ఆధారపడే ఆర్థికవ్యవస్థలను Fragile Fiveగా అభివర్ణిస్తారు. ముఖ్యంగా బ్రెజిల్, భారత్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాల ఆర్థిక వ్యవస్థలను మోర్గాన్ స్టాన్లీ ‘ఫ్రాగైల్ ఫైవ్’ గా పేర్కొంది. 2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే అంతర్జాతీయంగా ఇది ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. అయినప్పటికీ అటువంటి పరిస్థితి నుంచి తొందరగానే బయటపడిన భారత్.. ప్రస్తుతం ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారుతున్నట్లు ఇటీవలి ఆర్థిక సర్వేలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జీరో బడ్జెట్ అంటూ ట్విటర్లో విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బడ్జెట్ వల్ల వేతన జీవులు, పేదలు, మధ్య తరగతి ప్రజలు, అణగారిన వర్గాలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అంతేకాకుండా యువత, రైతులు, చిన్నతరహా పరిశ్రమలతో పాటు అన్ని వర్గాల వారికి మొండిచెయ్యి చూపిందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఆర్థికమంత్రి.. మాకు చెప్పేముందు చేసి చూపించండంటూ ఘాటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు