NITI Aayog: నీతి ఆయోగ్ ఉపాధ్యక్ష పదవికి రాజీవ్ కుమార్ రాజీనామా
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడుగా ఉన్న రాజీవ్కుమార్ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు.
దిల్లీ: నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడుగా ఉన్న రాజీవ్కుమార్ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో కేంద్ర నియామకాల కేబినెట్ ఉపసంఘం ఆయన రాజీనామాను ఆమోదించింది. అనంతరం రాజీవ్కుమార్ స్థానంలో సుమన్ బెరీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి ఆయన బాధ్యతలు తీసుకుంటారని పేర్కొంది. రాజీవ్కుమార్ పదవీకాలం ఏప్రిల్ 30 వరకు ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేశారు.
గతంలో ఉన్న ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ప్రవేశపెడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి తొలి ఉపాధ్యక్షుడిగా అర్వింద్ పనగరియా నియామకమయ్యారు. అనంతరం 2017 ఆగష్టులో రాజీవ్కుమార్ ఈ పదవీ బాధ్యతలు చేపట్టారు. నూతన ఉపాధ్యక్షుడిగా నియమితులైన సుమన్ బెరీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానామిక్ రిసెర్చ్(ఎన్సీఏఈఆర్)లో డైరక్టర్ జనరల్గా విధులు నిర్వహించారు. దిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్లో సుమన్ బెరీ విజిటింగ్ ఫెల్లోగా ఉన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో, స్టాటిస్టికల్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానానికి సంబంధించి సాంకేతిక సలహా కమిటీలో సభ్యుడిగా పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్