Nitish Kumar: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్ కుమార్..? ఎన్సీపీ ఏమందంటే..!
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. జనతాదళ్(యునైటెడ్) పార్టీ
ముంబయి: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. జనతాదళ్(యునైటెడ్) పార్టీ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను.. భాజపాతో సంబంధాలు తెంచుకుంటే ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.
‘‘విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నితీశ్ పేరును ప్రకటించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి ఎంపికపై అన్ని పార్టీల నాయకులు చర్చించుకున్న తర్వాతే నిర్ణయం వెలువడుతుంది. అయితే భాజపాతో పొత్తు నుంచి బయటకు వచ్చేంతవరకు నితీశ్ పేరుపై ఎలాంటి చర్చ జరిగే అవకాశాలు లేవు. ముందు ఆయన భాజపాతో సంబంధాలు తెంచుకోవాలి. ఆ తర్వాతే ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనను అభ్యర్థిగా ప్రకటించాలా వద్దా అన్న అంశంపై చర్చ జరుపుతారు’’ అని నవాబ్ మాలిక్ తెలిపారు.
ఇటీవల నితీశ్ కుమార్తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయిన విషయం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ కోణం లేదని నితీశ్ కుమార్ చెప్పినప్పటికీ.. ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించేందుకే పీకే ఆయనతో సమావేశమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఈ కూటమిలో భాజపాకే అత్యధిక సీట్లు ఉన్నప్పటికీ.. జేడీయూ నేత నితీశ్కే రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పారు. అయితే ఇటీవల ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య నితీశ్ కూడా పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించడం ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో పీకే - నితీశ్ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే