Parliament: లోక్సభలో 20 నిమిషాల పాటు మూగబోయిన మైకులు!
లోక్సభ (LokSabha) కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు ఆడియో పని చేయలేదు. ప్రతిపక్షాల గొంతు వినిపించకుండా చేసేందుకే అధికార భాజపా ఈ చర్యలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది.
దిల్లీ: లోక్సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రతి పక్షాల గొంతు వినిపించకుండా అధికార పక్షం మైకులను ఆఫ్ చేస్తోందని ఆరోపించిన కాంగ్రెస్.. తాజాగా సభా కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియకుండా ఆడియోను నిలిపివేసిందంటూ విమర్శించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. అయితే, కాంగ్రెస్ వ్యాఖ్యలను భాజపా కొట్టిపారేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని, సాంకేతిక తప్పిదం వల్లే ఆడియో నిలిచిపోయిందని వివరణ ఇచ్చింది. ప్రతిరోజూ సభ కార్యకలాపాలను యథాతథంగా ప్రసారం చేస్తున్నామని, గతంలో సభను ప్రతిపక్షం అడ్డుకున్నప్పడు వారి నినాదాలు కూడా ఆడియోలో వినిపించాయని గుర్తు చేసింది.
ఇవాళ ఉదయం సభ ప్రారంభమైన తర్వాత అదానీ వ్యవహారంలో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేయాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. వెల్లోకి దూసుకొచ్చి స్పీకర్ ఓం బిర్లా ఎదుట ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి కొద్దిసేపటికే ఆడియో వినిపించలేదు. దాదాపు 20 నిమిషాలపాటు ఇదే పరిస్థితి. ఆ తర్వాత సభ్యులంతా నిశ్శబ్దంగా ఉండాలని స్పీకర్ చెప్పినప్పుడే ఆడియో తిరిగి వచ్చింది. ఆ వెంటనే సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
లోక్సభలో చోటు చేసుకున్న ఈ వ్యవహారంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు గతంలో మైకులు నిలిపేశారు. మోదీ స్నేహితుడి కోసం ఇప్పుడు సభా కార్యక్రమాలనే సైలెంట్ చేశారు’’ అంటూ ట్విటర్లో పోస్టు చేసింది. జేపీసీని ఏర్పాటు చేయమన్నందుకే అధికార పక్షం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. అంతేకాకుండా తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని లోక్సభలో ప్రసంగించకుండా అడ్డుకునేందుకు భాజపా కుయుక్తులు పన్నుతోందని ఆరోపించింది. రాహుల్ గాంధీ లండన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేంత వరకు ఆయనకు లోక్సభలో ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వకూడదని భాజపా భావిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఒక్క రోజు కూడా సమావేశాలు సజావుగా సాగలేదు. రాహుల్ గాంధీ లండన్లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని అధికార భాజపా డిమాండ్ చేస్తోంది. రాహుల్ వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు తదితర కేంద్ర మంత్రులు మండిపడుతున్నారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అదానీ వ్యవహారంలో జేపీసీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఐదు రోజులుగా సభ ప్రారంభం కావడం, వాయిదా పడటం రివాజుగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.