
ఉద్యమ రైతుల్లో కరోనా లేదు!
ఎన్జీవోలు, వైద్యుల వెల్లడి
దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు నాలుగు నెలలకు పైగా ఆందోళన బాటపట్టిన రైతాంగంపై కరోనా ప్రభావంలేదని వైద్యులు వెల్లడించారు. రోగ నిరోధక శక్తితో రైతులు సురక్షితంగానే ఉన్నారని సింఘూ సరిహద్దులో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న డాక్టర్లు, ఎన్జీవోల ప్రతినిధులు పేర్కొన్నారు. ‘‘ఇక్కడి కొంతమంది జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో అందరికీ సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించాం. నలుగురిలో కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్షలకు పంపాం. ఫలితాల్లో వారికి నెగిటివ్ వచ్చింది’’ అని పశ్చిమబెంగాల్కు చెందిన వైద్యుడు సాగర్ తెలిపారు. వైరస్ బారిన పడకుండా అర్హులైన రైతులు టీకా తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ‘‘ వాతావరణంలోని మార్పుల కారణంగా పలువురిలో దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించాయి. అంతకుమించి ఎటువంటి అత్యయిక పరిస్థితి ఇక్కడ లేదు’’ అని లైఫ్ కేర్ ఎన్జీవో వ్యవస్థాపకుడు అవతార్ సింగ్ పేర్కొన్నారు. గతేడాది నవంబర్ నుంచి తాము ఇక్కడే ఉంటున్నామని, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయడం వంటి చర్యలు తీసుకోవడమే కాకుండా అనుమానం వచ్చిన రైతులను పరీక్షలకు పంపుతున్నామని వివరించారు. రైతుల్లో కొందరు తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని యునైటెడ్ సింగ్ ఆర్గనైజెషన్ వాలంటీర్ చరణ్జీత్ సింగ్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Agnipath IAF: అగ్నిపథ్కు దరఖాస్తుల వెల్లువ.. 6 రోజుల్లోనే 1.83లక్షల మంది నమోదు
-
Politics News
Telangana News: భాజపాలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి?
-
Sports News
Wimbledon 2022 : వింబుల్డన్లో యువ ప్లేయర్ సంచలనం.. అమెరికా దిగ్గజం ఇంటిముఖం
-
Politics News
Andhra News: అలాంటివి ఏపీలో తప్ప మరెక్కడా జరగవు: అశోక్బాబు
-
Movies News
Alitho Saradaga: పాత్ర నచ్చితే మళ్లీ విలన్గా చేస్తా: గోపీచంద్
-
India News
Udaipur Murder: ఉదయ్పుర్ దర్జీ హత్య.. స్లీపర్ సెల్స్ పనేనా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్పుర్
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- DilRaju: తండ్రైన దిల్రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్