కరోనా మరణాల్లేని 20 రాష్ట్రాలివే..!
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతున్న ఈ జిత్తులమారి వైరస్ ప్రజల్ని కలవరానికి గురిచేస్తోంది. తాజాగా......
ఆ 6 రాష్ట్రాలతోనే యాక్టివ్ కేసుల గ్రాఫ్ పైకి..
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతున్న ఈ జిత్తులమారి వైరస్ ప్రజల్ని కలవరానికి గురిచేస్తోంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం అంతగా కనబడనప్పటికీ కేవలం ఐదారు రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగానే ఉంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త మరణాలు నమోదుకాకపోవడం విశేషం. నిన్న 106 కొవిడ్ మరణాలు నమోదైనప్పటికీ వీటిలో 87% మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడులలోనే రావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్క కొవిడ్ మరణం కూడా సంభవించలేదు.
ఇక్కడ కొత్త మరణాల్లేవ్..
దేశంలో 20 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా మరణాలు సంభవించకపోవడం ఉపశమనం కలిగిస్తోంది. తెలంగాణ, యూపీ, రాజస్థాన్, ఏపీ, బిహార్, హిమాచల్ప్రదేశ్, పుదుచ్చేరి, అసోం, మణిపూర్, సిక్కిం, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, త్రిపుర, లక్షద్వీప్, మేఘాలయ, లద్దాఖ్, అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తరాఖండ్, దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో కొత్తగా కొవిడ్ మరణాలు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 106 మరణాలు నమోదైనప్పటికీ వాటిలో 87శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే. కొత్త మరణాల్లో మహారాష్ట్రలో 62, కేరళ 15, పంజాబ్ 7, కర్ణాటక 5, తమిళనాడు 3చొప్పున నమోదయ్యాయి.
ఆ 6 రాష్ట్రాలతోనే యాక్టివ్ కేసులు పైపైకి!
మరోవైపు, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ స్వైర విహారం చేస్తుండటంతో యాక్టివ్ కేసుల గ్రాఫ్ పైపైకి పోతోంది. ఆదివారం ఒక్కరోజే 15,510 కొత్త కేసులు రాగా.. వాటిలో 87.25% కేవలం ఆరు రాష్ట్రాల్లోనే వచ్చాయి. మహారాష్ట్ర (8293) కేరళ (3254), పంజాబ్ (579), కర్ణాటక (521), తమిళనాడు (479), గుజరాత్ (407)లలో కొత్త కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రస్తుతం 1,68,627 యాక్టివ్ కేసులు (1.52%) ఉన్నాయి. వీటిలో కేవలం 5 రాష్ట్రాల్లోనే 84% యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. ముఖ్యంగా మహారాష్ట్రలో 46.39% ఉండగా.. కేరళలో 29.49% ఉన్నాయి. ఇక కర్ణాటకలో 3.45%, పంజాబ్లో 2.75%, తమిళనాడులో 2.39% చొప్పున ఉండగా.. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి యాక్టివ్ కేసుల శాతం 15.52% ఉంది.
అరుణాచల్ ప్రదేశ్లో ‘సున్నా’
21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు 1000 కన్నా తక్కువగానే ఉండగా.. 15రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వెయ్యి కన్నా ఎక్కువ క్రియాశీల కేసులు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. వీటిలో కేరళ, మహారాష్ట్రలో 10వేలకు పైగా కేసులు ఉండగా.. మిగతా 13 రాష్ట్రాల్లో వెయ్యి నుంచి 10వేల వరకు యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. అరుణాచల్ప్రదేశ్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం విశేషం.
శరవేగంగా కొవిడ్ టీకా పంపిణీ
మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,43,1266 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. తొలి డోసు 66,69,985 మంది, రెండో డోసు 24,56,191 మంది ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేసినట్టు వివరించారు. అలాగే, 51,75,090 మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు తొలి డోసు అందించినట్టు తెలిపారు. మరోవైపు, నేటి నుంచి 60 ఏళ్లు పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా