వ్యాక్సిన్‌ వేసుకున్న వాళ్లకే ‘కిక్‌’!

దేశంలో కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎంతోమందిని పొట్టన పెట్టుకొన్న ఈ రక్కసి.. ఎన్నో కుటుంబాల్లో అంతులేని శోకం మిగుల్చుతోంది. ....

Published : 01 Jun 2021 01:37 IST

ఎత్వా జిల్లా యంత్రాంగం వినూత్న చర్యలు

లఖ్‌నవూ: దేశంలో కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎంతోమందిని పొట్టన పెట్టుకొన్న ఈ రక్కసి.. ఎన్నో కుటుంబాల్లో అంతులేని శోకం మిగుల్చుతోంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ ఒక్కటే అస్త్రం కావడంతో యూపీలోని ఎత్వా జిల్లా యంత్రాంగం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా సైఫాయి పట్టణంలోని మద్యం దుకాణాల వద్ద ప్రత్యేక నోటీసు బోర్డులు అంటించేలా చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు సర్టిఫికెట్‌ చూపించిన వాళ్లకే మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీచేసింది. 

వ్యాక్సిన్‌ వేయించుకోని వాళ్లకు మద్యం విక్రయించొద్దంటూ సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ తమకు ఆదేశాలు జారీచేసినట్టు మద్యం దుకాణదారుడు ఒకరు తెలిపారు. కరోనా టీకా వేయించుకున్నట్టుగా సర్టిఫికెట్‌ను చూపించిన తర్వాతే అమ్ముతున్నామన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నవాళ్లకు మాత్రమే మద్యం అందుబాటులో ఉంటుందని పేర్కొంటూ దుకాణాల బయట బోర్డులు ఏర్పాటు చేయడం గమనార్హం. మరోవైపు, ఎత్వా జిల్లాలో ఇప్పటివరకు 13,777 కేసులు నమోదు కాగా.. 279 మంది మరణించారు. వీరిలో 13,200మంది కోలుకోగా.. ప్రస్తుతం అక్కడ 298 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని