19 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్‌

దేశంలో కరోనా ప్రభావం నెమ్మదించింది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవలేదని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.

Published : 10 Feb 2021 14:54 IST

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: దేశంలో కరోనా ప్రభావం నెమ్మదించింది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవలేదని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. 33 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,000 కన్నా తక్కువ క్రియాశీల కేసులు ఉన్నాయన్నారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో గత మూడు వారాలుగా ఏడురాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.

కాగా బుధవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.08 కోట్లకు చేరుకోగా, 1,55,252 మరణాలు సంభవించాయి. రికవరీ రేటు 97.27 శాతంగా ఉండగా, క్రియాశీల కేసుల సంఖ్య 1.41లక్షలుగా ఉంది. ఆ రేటు 1.30 శాతానికి తగ్గింది. క్రియాశీల కేసుల్లో 71శాతం కేసులు కేరళ, మహారాష్ట్రల నుంచే నమోదయ్యాయని ఆ ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 9 నాటికి 66,11,561 మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్రం వెల్లడించింది.

ఇవీ చదవండి..

కరోనా జీవాయుధం కాకపోవచ్చు

సైబర్‌ మోసాలతో ‘అణు’ సంపద


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని