ముంబయిలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. దిల్లీలో 5 శాతానికి పాజిటివిటీ రేటు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన ఆంక్షలను సడలిస్తున్నట్లు స్థానిక యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూను...
ఇంటర్నెట్ డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన ఆంక్షలను సడలిస్తున్నట్లు స్థానిక యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు సినిమా హాళ్లు, రెస్టారంట్లు, ఈత కొలనులు, థీమ్ పార్కులను సగం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. పర్యాటక ప్రాంతాలు, బీచ్లు, పార్కులు ఎప్పటిలాగే తెరిచి ఉంటాయని వెల్లడించింది. వివాహాలకు బహిరంగ ప్రదేశాలు, బాంకెట్ హాల్స్లో 25 శాతం సామర్థ్యం లేదా 200 మంది అతిథులు.. ఏది తక్కువైతే దానికి వీలు కల్పించింది.
మరోవైపు ముంబయిలో వరుసగా రెండో రోజు మంగళవారం వెయ్యిలోపు రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 803 కొత్త కేసులు బయటపడ్డాయి. సోమవారం నమోదైన 960 కేసులతో పోలిస్తే 16 శాతం తక్కువ. రోజువారీ పాజిటివిటీ రేటు సైతం నిన్నటితో పోల్చితే 2.1 నుంచి 1.55 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం నగరంలో 8,800కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు.
దేశ రాజధాని దిల్లీలో 24 గంటల వ్యవధిలో 2683 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసుల (2,779)తో పోల్చితే కాస్త తగ్గుదల నమోదైంది. 27 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.09 శాతానికి తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.