కరోనా రెండో విజృంభణ.. కారణాలు ఏంటంటే?
సెకండ్ వేవ్కు మ్యుటేషన్ చెందిన రకాలే కారణమని నిర్ధారించే రుజువులు ఇప్పటివరకు బయటపడలేదని, అయినప్పటికీ ఇది కూడా కారణమయ్యే అవకాశాలున్నాయని వైరాలజీ నిపుణులు వెల్లడిస్తున్నారు.
ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ విశ్లేషణ
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైనట్లు నిపుణులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో కొత్తగా మ్యుటేషన్ చెందిన రకాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, సెకండ్ వేవ్కు మ్యుటేషన్ చెందిన రకాలే కారణమని నిర్ధారించే రుజువులు ఇప్పటివరకు బయటపడలేదని, అయినప్పటికీ ఇది కూడా కారణమయ్యే అవకాశాలున్నాయని వైరాలజీ నిపుణులు వెల్లడిస్తున్నారు. గత కొన్ని రోజుల్లోనే దేశంలో మరోసారి వైరస్ ఉద్ధృతి పెరగడానికి గల కారణాలను వారు విశ్లేషిస్తున్నారు.
సెకండ్ వేవ్కు కారణాలు..?
దేశంలో గత కొన్నిరోజులుగా మరోసారి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిత్యం రికార్డు స్థాయి కేసులు బయటపడుతున్నాయి. ఇలా వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరగడానికి ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడమే ముఖ్య కారణమని భారతదేశ అత్యున్నత సైన్స్ పురస్కారమైన శాంతి స్వరూప్ భట్నాగర్ గ్రహీత, ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ స్పష్టం చేశారు. దేశంలో వైరస్ సోకే అవకాశమున్న వారి సంఖ్య ఇంకా అధికంగా ఉండడంతో పాటు గత నాలుగు నెలలుగా కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లే సెకండ్ వేవ్కు దారితీసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. మహమ్మారి తీవ్రత కొనసాగుతోన్న సమయంలోనే వ్యాపార, వినోద కార్యకలాపాలు పూర్వస్థితికి రావడం కూడా ఇందుకు కారణమని షాహిద్ జమీల్ విశ్లేషించారు.
మ్యుటేషన్ చెందిన రకాలు కారణమా..?
కరోనా సెకండ్ వేవ్కు మ్యుటేషన్ చెందిన రకాలే కారణమని చెప్పేందుకు ఎలాంటి రుజువులు లేనప్పటికీ అది కూడా ఓ కారణం అయ్యే అవకాశం ఉందని షాహిద్ జమీల్ అభిప్రాయపడ్డారు. తొలి దఫా విజృంభణతో పోలిస్తే సెకండ్ వేవ్ కాలంలో కొవిడ్ మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. ఇక దేశంలో కొన్ని చోట్ల డబుల్ మ్యుటేషన్ చెందినట్లు వస్తోన్న నివేదికలపైనా ఆయన స్పందించారు. ప్రస్తుతానికి వైరస్ ఉద్ధృతికి డబుల్ మ్యుటేషన్లు కారణమని చెప్పలేమని, కానీ, అది కూడా సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. దేశంలో కొత్తగా వెలుగుచూస్తున్న మ్యుటేషన్లపై ఎప్పటికప్పుడు పరిశోధన జరుగుతోందన్నారు.
కలవరపెడుతోన్న డబుల్ మ్యుటేషన్..!
దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతోన్న వేళ కరోనా వైరస్ ‘డబుల్ మ్యుటేషన్’ వెలుగుచూడడం కలవరపెడుతోంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిలలో వెలుగు చూసిన కొత్తరకాలతో పాటు దేశంలో కొత్తగా ‘డబుల్ మ్యుటేషన్ వైరస్’ను గుర్తించినట్లు ఈ మధ్యే కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, దిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో L452R, E484Q మ్యుటేషన్ రకాలలో మార్పులను గమనించినట్లు పేర్కొంది. వైరస్ ఉద్ధృతికి ఈ మ్యుటేషన్లే కారణమా అనే కోణంలో ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించింది. ఇక వైరస్లోని రెండు ఉత్పరివర్తనాలు కలిసి ఒకే రకంగా మారడాన్నే ‘డబుల్ మ్యుటేషన్’గా పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్లో వెలుగు చూసిన L452R, E484Q మ్యుటేషన్ రకాల స్పైక్ ప్రొటీన్లలోని గ్రహకాలు కలిసిపోయి కొత్తరకంగా మారుతున్నట్లు గుర్తించారు. అయితే, ఇలా మ్యుటేషన్ చెందిన రకాలు కలిసిపోవడం సాధారణ ప్రక్రియేనని వైరాలజీ నిపుణులు పేర్కొంటున్నారు.
వ్యాక్సినేషన్తో కట్టడి..
కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తున్న వేళ.. దీన్ని కట్టడిచేసేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ఆరోగ్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, దేశంలో ఇప్పటివరకు కేవలం 5కోట్ల 55లక్షల డోసులను (మార్చి 26నాటికి) మాత్రమే పంపిణీ చేశారు. ఇది మొత్తం దేశ జనాభాలో 3.3శాతం మాత్రమే. ఇందులో కేవలం 85లక్షల మంది (0.6శాతం) మాత్రమే ఇప్పటి వరకు రెండు డోసులను తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆశించిన మేర వ్యాక్సిన్ పంపిణీ జరగడం లేదని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..