Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
నోయిడాలో కాలం చెల్లిన లక్షలాది కార్లను అధికారులే తుక్కు చేయనున్నారు. ఇందు కోసం ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పాత వాహనాలను స్వాధీనం చేసుకోనున్నారు.
నోయిడా: నోయిడా (Noida)లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు లక్షకు పైగా కాలం చెల్లిన వాహనాలను (Old Vehicles) ఫిబ్రవరి 1 తేదీ నుంచి అధికారులు సీజ్ చేయనున్నారు. ఇందులో కొన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్ NCR) పరిధిలో కాలుష్య తీవ్రత ఎక్కువగా నేపథ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ గతంలో కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్సీఆర్ పరిధిలో పాత వాహనాలను రోడ్లపై తిరగనివ్వొద్దని ఆదేశించింది. అటు కాలం చెల్లిన వాహనాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తుక్కు పాలసీని తీసుకొచ్చింది. అయితే ఈ పాలసీకి ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో నోయిడా అధికారులు చర్యలు ప్రారంభించారు.
గతేడాది అక్టోబరు నుంచి 15 ఏళ్లు పైబడిన పెట్రోల్, 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. గౌతమ్ బుద్ధ్ నగర్లో 1,19,612 కార్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. ఇందులో జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీసు కమిషనరేట్, జిల్లా కోర్టు, ట్రేడ్ ట్యాక్స్ కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ వంటి ప్రభుత్వ విభాగాలకు చెందిన వాహనాలు కూడా ఉన్నాయి. రెండు నెలల కిందటే ఆ వాహన యజమానులకు నోయిడా ఆర్టీఓ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఆ పాత కార్లను అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. సీజ్ చేసిన కార్లను డంపింగ్ పార్క్లో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ పాత కార్ల (Old Cars)ను తుక్కుగా మార్చడం లేదా నిరభ్యంతర పత్రంతో మరో ప్రాంతానికి తీసుకెళ్లేందుకు అనుమతులు జారీ చేయడం వంటివి చేయనున్నట్లు నోయిడా అధికారులు వెల్లడించారు. యూపీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలో 34 జిల్లాల్లో గాలి నాణ్యత మెరుగ్గా ఉంది. నోయిడాలోని పాత వాహనాలను అక్కడ వినియోగించుకునేందుకు అనుమతులు కల్పిస్తున్నాయి. అయితే, ఆ జిల్లాల్లోని ప్రాంతీయ రవాణా కార్యాలయాల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’