North Korea: ఏడాది తర్వాత ఉభయ కొరియాల మధ్య సంబంధాలు..!

దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ఉభయ కొరియాల మధ్య సంబంధాలు మొదలయ్యాయి. ఇరు పక్షాలు మధ్య విశ్వనీయత పెంపొందించుకోవడంపై చర్యలు తీసుకొన్నారు. 2020లో ఇరు దేశాల మధ్య సదస్సు విఫలం కావడంతో ఉత్తరకొరియా హాట్‌లైన్‌

Published : 27 Jul 2021 17:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ఉభయ కొరియాల మధ్య సంబంధాలు మొదలయ్యాయి. ఇరు పక్షాల మధ్య విశ్వనీయత పెంపొందించుకోవడంపై చర్యలు తీసుకొన్నారు. 2020లో ఇరు దేశాల మధ్య సదస్సు విఫలం కావడంతో ఉత్తరకొరియా హాట్‌లైన్‌ సంబంధాలను తెంచుకొంది. అంతేకాదు ఇంటర్‌ కొరియన్‌ బోర్డర్‌ ఆఫీస్‌ను పేల్చేసింది. వాస్తవానికి ఈ భవనాన్ని ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్ట పర్చేందుకు నిర్మించారు.   

తాజాగా ఇరుపక్షాల సంబంధాల పునరుద్ధరణపై ఉత్తరకొరియా న్యూస్‌ ఏజెన్సీ ప్రకటన చేసింది. ‘‘అత్యున్నత నాయకుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య కమ్యూనికేషన్‌ లైజన్‌ లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. జులై 27వ తేదీ ఉదయం నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలు పునరుద్ధరణకు చర్యలు తీసుకొనేందుకు అంగీకరించారు’’ అని ఆ పత్రిక పేర్కొంది. 

ఇప్పటికే ఇరుపక్షాల ప్రతినిధులు కొత్తగా ఏర్పాటు చేసిన హాట్‌లైన్లో మూడు నిమిషాలపాటు మాట్లాడుకొన్నారు. భవిష్యత్తులో రోజువారీ చర్చలు జరుగుతాయన్నారు. 

2018లో ఇరు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. దక్షిణకొరియా అధినేత మూన్‌ జే ఇన్‌, ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ మూడు సార్లు చర్చల్లో పాల్గొన్నారు. కానీ, నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉ.కొరియా అధినేత కిమ్‌ల మధ్య వియత్నాంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఆ ప్రభావం ద.కొరియాపై పడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ దెబ్బతిన్నాయి.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని