Kim Jong-un: కిమ్ చేతికి కొత్త ఆయుధం.. బైడెన్కు తలనొప్పి..!
బైడెన్ శ్వేత సౌధంలో అడుగుపెట్టినప్పటి నుంచి కష్టాలకు ఎదురీదుతున్నారు. కొవిడ్ టీకా కార్యక్రమంలో విజయం సాధించేందుకు చేసిన యత్నం విఫలమై.. రోజుకు దాదాపు లక్షన్నర కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఉ.కొరియా ఆయుధీకరణతో అమెరికాకు కష్టాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
బైడెన్ శ్వేత సౌధంలో అడుగుపెట్టినప్పటి నుంచి కష్టాలకు ఎదురీదుతున్నారు. కొవిడ్ టీకా కార్యక్రమంలో విజయం సాధించేందుకు చేసిన యత్నం విఫలమై.. రోజుకు దాదాపు లక్షన్నర కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క అఫ్గాన్లో బలగాల ఉపసంహరణ విషయం బైడెన్ వైఫల్యాలను మిత్రదేశాలు కూడా తప్పు పడుతున్నాయి. చైనా విషయంలో అనుకున్నంత దూకుడుగా ఏమీ ఉండలేకపోతున్నారు. ట్రంప్తో చర్చలతో కొంత నెమ్మదించిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన ఆయుధాలకు పదును పెట్టడం మొదలుపెట్టారు.
సరికొత్త క్షిపణి పరీక్ష..
ఉత్తర కొరియా నేడు మొట్టమొదటి మధ్యశ్రేణి క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది. ఇది 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఈ విషయాన్ని ‘వాయిస్ ఆఫ్ కొరియా’ పేర్కొంది. తాజా పరీక్ష ఐరాస ఆంక్షల ఉల్లంఘన కాదు. కానీ, ఉ.కొరియా కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం ఆపలేదు. ‘ఈ పరీక్ష వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను భయపెట్టి ప్రభావవంతమైన రక్షణ కల్పిస్తుంది. అంటే ప్రత్యర్థి దేశాల సైనిక చర్యల నుంచి కచ్చితమైన రక్షణ ఉంటుంది’ అని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ పేర్కొంది. ఈ ప్రయోగానికి కిమ్ హాజరు కాలేదు. ఈ పరీక్షను జాగ్రత్తగా పరిశీలించి అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలతో కలిసి విశ్లేషిస్తామని దక్షిణ కొరియా ప్రతినిధులు తెలిపారు.
అమెరికా మిత్రులకు ముప్పే..
ఈ క్షిపణి పరీక్ష అమెరికా మిత్రులకు కచ్చితంగా ముప్పేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. మధ్యశ్రేణి ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణి దాదాపు బాలిస్టిక్ క్షిపణి అంత ముప్పును సృష్టిస్తుంది. దీనికి అణువార్ హెడ్ అమరిస్తే ప్రమాదం మరింత తీవ్రమవుతుంది. ఇలాంటి క్షిపణి ఉత్తరకొరియా చేతిలో పడటం నిజంగా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ముప్పే. క్షిపణుల గమనాన్ని గుర్తించే రాడార్లను తప్పించుకొని ఇది ప్రయాణించగలదు.
ఉత్తర కొరియాతో శాంతిచర్చలకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు రేపు జపాన్లోని టోక్యోలో ఒక భేటీ జరగనుంది. ఈ భేటీలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ప్రతినిధులు పాల్గొనున్నారు. దీనికి ముందే ఈ పరీక్ష జరగడం గమనార్హం. మరోపక్క బైడెన్ సర్కారు ఇప్పటికే ఉ.కొరియా అణునిరాయుధీకరణపై చర్చంచడానికి సిద్ధమేనని ప్రకటించింది. కానీ, ఆంక్షలను తొలగించడానికి మాత్రం సుముఖంగా లేదు.
ఆంక్షలున్నా ఎందుకీ తెగింపు..
ఒక పక్క ఐరాస ఆంక్షల కారణంగా ఉ.కొరియా దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అయినా కానీ, ఆ దేశం లక్ష్య పెట్టకుండా ఈ క్షిపణి పరీక్షలు చేస్తోంది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా భౌగోళిక రాజకీయ పరిణామాలు మారాయి. ఈ నేపథ్యంలో తాము ఆయుధ పరీక్షలు చేస్తే అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ప్రతిస్పందనలను అంచనా వేయడం కోసం ఇది చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నా.. ప్రమాదకరమైన ఆయుధాలను అభివృద్ధి చేయగలననే సందేశం ఇవ్వడం కోసం కూడా ఇలా చేసే ప్రమాదం ఉంది.
అణ్వాయుధం అమర్చవచ్చా..?
తాజాగా ప్రయోగించిన క్షిపణి దాదాపు 1,500 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంటే జపాన్ వరకూ వెళ్లగలదు. ఈ క్షిపణిపై వాయిస్ ఆఫ్ కొరియా స్పందిస్తూ వ్యూహాత్మక ఆయుధంగా పేర్కొంది. అంటే దీనిపై న్యూక్లియర్ వార్ హెడ్ అమర్చాలనే ఉద్దేశం ఉ.కొరియాకు ఉన్నట్లు తెలుస్తోంది.
బైడెన్ వేచి చూసే ధోరణితో అసహనం..
బైడెన్ ప్రభుత్వం గతంలో ఒబామా పాలన సమయంలో అనుసరించిన వ్యూహాత్మక సహనం ప్రదర్శించాలని భావిస్తున్నట్లు వాయిస్ ఆఫ్ అమెరికాలో నిపుణులు అభిప్రాయ పడ్డారు. అంటే.. గతంలో ట్రంప్ వలే మరోసారి వెంటనే చర్చలు జరిగే అవకాశాలు దాదాపు లేవనే అర్థం. యథాతథ పరిస్థితి కొనసాగుతుంది. అందుకే అమెరికా చర్చలపై ప్రకటన చేసే సమయంలో అప్రమత్తంగా ఉంటోంది. ‘ఉ.కొరియా అణునిరాయుధీకరణపై చర్చలు జరిపేందుకు సిద్ధమే’ అని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ప్రైస్ గురువారం పేర్కొన్నారు. అంటే ఉ.కొరియా అణ్వస్త్రాలు వదులుకొనేందుకు సిద్ధపడి చర్చలకు రావాలనే అర్థం. ఇది ఉ.కొరియాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే కిమ్ బృందం తరపున దీనిపై ఎటువంటి స్పందనా వెలువడలేదు. కొన్ని రోజుల తర్వాత ఉ.కొరియా తొలి మధ్యశ్రేణి క్రూయిజ్ క్షిపణి గాల్లోకి ఎగిరింది. 2019 తర్వాత ఉ.కొరియా పరీక్షించిన కొత్త ఆయుధం ఇదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?