సైబర్ మోసాలతో ‘అణు’సంపద
ప్రపంచమంతా ఓ దారైతే.. తనదో దారి అంటుంది ఉత్తరకొరియా. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను కూడా లెక్కచేయకుండా అణు పరీక్షలు చేసి అగ్రరాజ్యం అమెరికాను భయపెట్టాలని చూస్తోన్న కిమ్ రాజ్యం
ఉత్తరకొరియా దుస్సాహసం.. ఆన్లైన్లో దోపిడీ
యునైటెడ్ నేషన్స్: ప్రపంచమంతా ఓ దారైతే.. తనదో దారి అన్నట్లు ఉంటుంది ఉత్తరకొరియా వ్యవహారం. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను సైతం లెక్కచేయకుండా అణు పరీక్షలు చేసి అగ్రరాజ్యం అమెరికాను భయపెట్టాలని చూస్తోన్న కిమ్ రాజ్యం.. ఇప్పుడు కరోనాతో కఠిన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. మరి తినడానికే తిండి లేనప్పుడు అణు పరీక్షలకు డబ్బెలా.. అందుకేనేమో ఆన్లైన్లో దోపిడీకి దిగింది. సైబర్ నేరాలకు పాల్పడుతూ 300 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని తస్కరించింది. ఆ నిధులతో తన అణ్వాయుధాలు, క్షిపణులను ఆధునీకరిస్తోందట. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ రహస్య నివేదిక ద్వారా వెల్లడైంది.
ఈశాన్య ఆసియా దేశాలపై ఆంక్షలను పర్యవేక్షించిన ఐరాస నిపుణుల కమిటీ ఒకటి ఆ నివేదికను సోమవారం భద్రతా మండలి సభ్యులకు పంపింది. 2019 నుంచి 2020 నవంబరు మధ్య ఉత్తర కొరియా హ్యాకర్లు పలుమార్లు సైబర్ దాడులు జరిపి 316.4 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని దోచుకున్నట్లు ఈ కమిటీ తమ నివేదికలో పేర్కొన్నట్లు భద్రతా మండలిలోని విశ్వసనీయ వర్గాలు బహిర్గతం చేశాయి. ఉత్తరకొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యకలాపాల కోసం ఆ దేశ హ్యాకర్లు.. ఆర్థిక సంస్థలు, వర్చువల్ కరెన్సీ ఎక్స్ఛేంజ్ హౌస్లపై దాడి చేసి డబ్బు దొంగలించాయని నివేదిక తెలిపింది. సైబర్ దాడులకు పాల్పడిన హ్యాకర్లకు డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాతో సంబంధాలున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. ఇటీవల ఆ దేశంలో జరిగిన మిలిటరీ పరేడ్లో ఆధునీకరించిన తమ ఆయుధ సంపత్తిని ఉత్తరకొరియా ప్రదర్శించినట్లు పేర్కొంది.
నిజానికి ఉత్తరకొరియా అణ్వాయుధ ప్రయోగాలు చేయకుండా ఐరాస ఆంక్షలు ఉన్నాయి. 2006లో తొలిసారిగా అణు పరికరాన్ని ప్రయోగించినప్పటి నుంచి ఆ దేశంపై ఐరాస కఠిన ఆంక్షలు విధించింది. అణు పరీక్షలు చేయకుండా ఉత్తరకొరియాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశం నుంచి చాలా ఎగుమతులను నిషేధించింది. దిగుమతులను కూడా పరిమితం చేసింది. అయినప్పటికీ ఆ ఆంక్షలను బేఖాతరు చేస్తూ కిమ్ రాజ్యం తన అణు సంపత్తిని పెంచుకుంటోందని పలుమార్లు బహిర్గతమైంది. ఇక ఎగుమతులు లేకపోవడంతో ఆర్థికంగా పుంజుకోవడం కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తాజాగా రుజువైంది.
అమెరికాను అడ్డుకునేందుకేనా..
2017లో ఉత్తరకొరియా థర్మోన్యూక్లియర్ వార్హెడ్తో పాటు కొన్ని క్షిపణి పరీక్షలు జరిపింది. అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరుకునేలా వీటిని రూపొందించినట్లు అప్పట్లో కిమ్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య చిచ్చు రాజుకుంది. ఈ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి 2019లో ఇరు దేశాల అధినేతలు మూడుసార్లు సమావేశమయ్యారు. అయితే కిమ్ డిమాండ్లను అప్పటి అగ్రరాజ్యాధినేత ట్రంప్ తిరస్కరించడంతో విఫలమయ్యాయి. ఇటీవల ఉత్తరకొరియాలో జరిగిన రాజకీయ సమావేశంలో కిమ్.. మరోసారి అణ్వాయుధాల గురించి నొక్కిచెప్పినట్లు తెలిసింది. అణు కార్యక్రమాల కోసం అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
ఆర్థిక సంక్షోభంలో..
గతేడాది ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో ఉత్తరకొరియా బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంది. సరిహద్దులు మూసేసి సరకు రవాణాను నిలిపివేసింది. దీంతో అంతంతమాత్రంగానే ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో నిధుల కోసం సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు