భవిష్యత్తులో..సాధారణ జలుబుగానే కరోనా!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి రాబోయే రోజుల్లో ఓ సాధారణ జలుబు మాదిరిగానే మారనుందని తాజా పరిశోధన వెల్లడించింది.
అంచనా వేసిన అమెరికా శాస్త్రవేత్తలు
దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి రాబోయే రోజుల్లో ఓ సాధారణ జలుబు మాదిరిగానే మారనుందని తాజా పరిశోధన వెల్లడించింది. ప్రస్తుతం మహమ్మారిగా ఉన్న కరోనా వైరస్, ఎండమిక్గా మారిన తర్వాత తీవ్రత తగ్గవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా వైరస్ బారినపడుతోన్న చిన్నారులకు భవిష్యత్తులో ఇది సాధారణ జలుబుగానే మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సార్స్-కోవ్-1 తోపాటు మరో నాలుగు కరోనా వైరస్ రకాలపై జరిపిన ఈ పరిశోధన పత్రం తాజాగా సైన్స్ జర్నల్లో ప్రచురితమైంది.
సాధారణ ప్రజల్లో ఇది విస్తృతంగా వ్యాపించిన తర్వాత ఇది స్థానిక వ్యాధిగా మారే అవకాశం ఉన్నట్లు అమెరికా పరిశోధకులు అంచనా వేశారు. ఇప్పటికే ఈ గ్రూపు వైరస్లకు సంబంధించిన వ్యాధినిరోధక చికిత్సా విధానం, సాంక్రమిక వ్యాధుల అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ప్రస్తుతం విజృంభిస్తోన్న కరోనా వైరస్ తీవ్రత తీరును శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సాధారణ జలుబుకు కారణమయ్యే నాలుగు రకాల కరోనా వైరస్లు ప్రస్తుతం వ్యాప్తిలో ఎంతోకాలంగా ఉన్నాయని, ప్రతిఒక్కరు వారి చిన్నతనంలోనే వీటి బారినపడి ఉంటారని తెలిపారు.
చిన్నారుల్లో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల వారిలో రోగనిరోధకత లభిస్తుందని, ఇవి భవిష్యత్తులో వచ్చే తీవ్ర రోగాలను ఎదుర్కోవడంలో దోహదపడుతాయని అమెరికాలో ఎమోరీ యూనివర్సిటీకి చెందిన జెన్నీ లావైన్ వెల్లడించారు. అయితే, అప్పుడప్పుడు సంభవించే రీ ఇన్ఫెక్షన్లను మాత్రం నియంత్రించలేవని తెలిపారు. 3 నుంచి 5ఏళ్లలోపు చిన్నారుల్లో సార్స్-కోవ్-2 తొలుత సంక్రమించినప్పుడు ఓ వ్యాధిలో కనిపించినప్పటికీ, తర్వాత దాని తీవ్రత తగ్గి స్వల్ప వ్యాధిలాగే మారుతుందని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ పెద్దవారికి వైరస్ సోకినప్పుడు తీవ్రతను తగ్గించడంలో వారి చిన్నతనంలో వైరస్ వల్ల పొందిన రోగనిరోధకత రక్షణ కలిపిస్తుందని అంచనా వేశారు. అయితే, ఇది జరగడానికి ఎంతకాలం పడుతుందనే విషయం మాత్రం వైరస్ వ్యాప్తి, వ్యాక్సిన్ల వల్ల పొందే రోగనిరోధకతపైన ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం చేపడుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా లక్షల మంది ప్రాణాలు కాపాడగలమని అమెరికా శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
ఇవీ చదవండి..
భారత్: 100దాటిన కొత్తరకం కేసులు
అది నిజంగా చైనా టీకానే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’