కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.15లక్షలు 

ఒక్కో జర్నలిస్టు కుటుంబానికి రూ.15 లక్షలు జర్నలిస్ట్‌ వెల్‌ఫేర్‌ ఫండ్‌ తరఫు నుంచి అందనుంది

Published : 24 Jul 2021 23:43 IST

ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం

భువనేశ్వర్‌: కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా నిలిచి..  వైరస్‌ బారిన పడి మరణించిన జర్నలిస్టులకు ఒడిశా ప్రభుత్వం అండగా నిలిచింది. ఈమేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘‘కొవిడ్‌ బారిన పడి చనిపోయిన 17 మంది జర్నలిస్టులకు రూ.2.25 కోట్లు ప్రభుత్వం తరఫు నుంచి సాయంగా అందనుంది. గతంలో సమాచార, పౌర సంబంధాల శాఖ జర్నలిస్టులను ఆదుకోవాలని తీసుకొచ్చిన ప్రతిపాదనకు శుక్రవారం ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆమోదం తెలిపారు’’ అని ప్రకటించింది. ఈమేరకు ఒక్కో జర్నలిస్టు కుటుంబానికి రూ.15 లక్షలు.. జర్నలిస్ట్‌ వెల్‌ఫేర్‌ ఫండ్‌ తరఫు నుంచి అందనుంది. టీవీ, పత్రికా రంగానికి చెందిన జర్నలిస్టులే కాకుండా ఫ్రీలాన్సర్లుగా పనిచేసే వారికి ఈ ఫండ్‌ అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని