Ashwini Vaishnaw: రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలోని బహనాగ్‌ బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంపై  రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఆయన.. ముమ్మరంగా సహాయకచర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Updated : 03 Jun 2023 12:48 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలోని బహనాగ్‌ బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఆయన.. ముమ్మరంగా సహాయకచర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు.

‘‘క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం సహాయకచర్యలపై పూర్తిగా దృష్టి సారించాం. ఘటనాస్థలిలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం. ప్రమాద ఘటనపై విచారణ చేసి మరిన్ని వివరాలు చెబుతాం. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశాం’’ అని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని