Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాదం.. 40కిపైగా రైళ్లు రద్దు..

ఒడిశాలో ఘోర రైలు ప్రమాద నేపథ్యంలో 40కిపైగా రైళ్లు రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

Updated : 03 Jun 2023 11:42 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో 40కిపైగా రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అదే విధంగా 38 రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగే సమయానికి ఖరగ్‌పూర్‌లో ఉన్న  చెన్నై సెంట్రల్‌-హావ్‌డా (12480) రైలును జరోలీ మీదుగా పంపించారు. అలాగే.. వాస్కోడగామా-షాలీమార్‌ (18048) రైలును కటక్‌ మీదుగా పంపించారు. సికింద్రాబాద్‌-షాలిమార్‌ వీక్లీ (22850) రైలును కటక్‌ మీదుగా నడుపుతున్నారు. హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12837), హావ్‌డా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌(12863), హావ్‌డా-చెన్నై మెయిల్‌ (12839), హావ్‌డా-సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌  (20831) రైళ్లను రద్దు చేశారు. ప్రధాని చేతుల మీదుగా శనివారం జరగాల్సిన గోవా-ముంబై వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభోత్సవాన్ని కూడా రద్దు చేశారు.

రద్దైన రైళ్ల వివరాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని