Omicron scare: దిల్లీ, ముంబయిల్లోకొవిడ్ గ్రాఫ్ మళ్లీపైకి.. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు షురూ!
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతున్న వేళ కొవిడ్ కేసులూ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే దిల్లీ, ముంబయి మహానగరాల్లో పెద్ద ఎత్తున పెరుగుదల నమోదైంది. మరోవైపు, ఒమిక్రాన్ కేసులు కూడా......
దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతున్న వేళ కొవిడ్ కేసులూ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే దిల్లీ, ముంబయి మహానగరాల్లో భారీగానే కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో ఈ మహమ్మారి కట్టడికి మళ్లీ కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, దిల్లీ, యూపీ సహా పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు కూడా నిబంధనల్ని ప్రకటిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి 2వరకు పలు కొవిడ్ నిబంధనలు ప్రకటించింది. దిల్లీలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనుల నుంచి రూ.1.5కోట్లు జరిమానా వసూలు చేశారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్కు సంబంధించిన కొన్ని వార్తలు సంక్షిప్తంగా..!
దిల్లీలో 37%.. ముంబయిలో 10% పెరిగిన కొవిడ్ కేసులు
దేశ రాజధాని నగరంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 249 కొత్త కేసులు వచ్చాయి. నిన్నటితో (180 కేసులు) పోలిస్తే కేసుల్లో 38శాతం పెరుగుదల నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. గత ఆరు నెలల్లో ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. కొత్తగా 96మంది కోలుకోగా.. ఒక మరణం నమోదైంది. ప్రస్తుతం దిల్లీలో క్రియాశీల కేసుల సంఖ్య 934కి పెరిగింది. ఈరోజు దిల్లీలో 57,295 శాంపిల్స్ని పరీక్షించారు.
మరోవైపు, మహారాష్ట్రలోని ముంబయిలో కొవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శనివారం ఏకంగా 757 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో (683 కేసులు) పోలిస్తే ఈ సంఖ్య 10శాతం అధికం కావడం గమనార్హం. అలాగే, కొత్తగా మరో 280మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ముంబయిలో ప్రస్తుతం 3703 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముంబయిలో కొత్తగా మరణాలేమీ నమోదు కాలేదు. 24గంటల వ్యవధిలో ఇక్కడ 42427 శాంపిల్స్ పరీక్షించారు.
దిల్లీలో ఉల్లంఘనులకు ₹1.5కోట్ల జరిమానా!
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ దిల్లీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది. కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించేవారికి జరిమానాలు విధిస్తోంది. ఈ నెల 22, 23 తేదీల్లో జరిమానా రూపంలో 1.5కోట్ల మొత్తం వసూలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఉల్లంఘనకు పాల్పడిన వారిలో తూర్పు దిల్లీ, ఉత్తర దిల్లీ ప్రాంతాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. తూర్పు దిల్లీ నుంచి 1245 మంది ఉండగా.. ఉత్తర దిల్లీ నుంచి 1446 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరందరి నుంచి 1.5కోట్ల మేర వసూలు చేసినట్టు వివరించారు. మాస్క్ ధరించకుండా తిరగడం, భౌతికదూరం పాటించడం వంటి కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిని 7,778 మందిని పట్టుకొని 163 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు చెప్పారు.
విదేశాలకు ప్రయాణాలకు వెళ్లకపోయినా వైద్యుడికి ఒమిక్రాన్
బెంగాల్లో ఓ జూనియర్ వైద్యుడికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది. కోల్కతా వైద్య కళాశాల ఆస్పత్రికి చెందిన 21 ఏళ్ల జూనియర్ వైద్యుడికి వైరస్ సోకడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4కి చేరింది. అతడికి జ్వరం రావడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడి శాంపిల్స్ని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కి పంపగా శుక్రవారం రాత్రి వచ్చిన నివేదికలో ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో బాధితుడిని కోల్కాలోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. బాధితుడు నదియా జిల్లాలోని కృష్ణానగర్కు చెందినవాడిగా గుర్తించారు. అయితే, అతడు విదేశీ ప్రయాణాలకు వెళ్లకపోయినా ఒమిక్రాన్ సోకింది. దీంతో అతడికి ఎలా సోకిందనే విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
హరియాణాలో తాజా ఆంక్షలు
హరియాణాలో నైట్ కర్ఫ్యూ అమలుచేస్తున్నట్టు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నిన్న ప్రకటించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాక రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. బహిరంగ కార్యక్రమాలు, వేడుకలకు 200 మంది మించరాదని నిబంధన విధించినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులతో సమీక్షించిన అనంతరం తాజా ఆంక్షల్ని ప్రకటించారు. వ్యాక్సినేషన్ పూర్తి కాకపోతే బహిరంగ ప్రదేశాలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించిన హరియాణా ప్రభుత్వం.. జనవరి 1 నుంచి రెండో డోసును తప్పనిసరి చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
యూపీలో నేటి నుంచే నైట్ కర్ఫ్యూ
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కూడా శనివారం (డిసెంబర్ 25) నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు ఈ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటుందని తెలిపింది. అలాగే వివాహాలు, వేడుకలకు 200 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా పాల్గొన్న వారంతా తప్పకుండా కొవిడ్ నిబంధలను పాటించాలని స్పష్టం చేసింది.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు. -
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
Dubai Rains: దుబాయ్లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి మన దౌత్య కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది. -
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ వీడియో వైరల్ కాగా, తాజాగా రణ్వీర్సింగ్కు అదే పరిస్థితి ఎదురైంది. -
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు