కరోనా ఎఫెక్ట్‌: విమానాల్లో ‘భోజనం’పై నిషేధం

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలపై నిషేధం విధించింది. ఏప్రిల్‌ 15 నుంచి

Published : 12 Apr 2021 17:18 IST

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో భోజనసేవలలను నిలిపివేసింది. ఏప్రిల్‌ 15 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. 

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో గతేడాది కేంద్రం దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మే 25 నుంచి దశల వారీగా ఈ సేవలను పునరుద్ధరించింది. కానీ, దేశీయ విమానాల్లో భోజన సేవలను అనుమతించలేదు. ప్రయాణికులు సొంతంగా ఆహారపదార్థాలను కూడా తీసుకురావొద్దని పేర్కొంది. ఆగస్టు 31 తర్వాత కొన్ని షరతులతో ఈ భోజన సదుపాయాలను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది.

అయితే ఇటీవల కొద్ది రోజులుగా దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భోజన సేవలపై పౌర విమానయాన శాఖ నేడు సమీక్ష నిర్వహించింది. రెండు గంటల కంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో ఈ సేవలపై నిషేధం విధించింది. ‘‘దేశీయంగా విమాన సేవలు అందించే ఎయిర్‌లైన్లు రెండు గంటలు అంతకంటే ఎక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో మాత్రమే భోజన సేవలను అందించాలి’’ అని మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌ ముప్పు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని