Yogi adityanath: అది మొదలైతే.. ప్రపంచ పటంలో పాక్‌ ఉండదు: యోగి

ఉత్తర్‌ప్రదేశ్‌ రక్షణ కారిడార్‌లో (UPDIC) తయారైన ఫిరంగులు గర్జించడం మొదలు పెడితే పాకిస్థాన్‌ (Pakistan) ప్రపంచ పటం నుంచి అదృశ్యమవుతుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు.

Published : 18 Feb 2023 09:52 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar pradesh)లో రక్షణ కారిడార్‌ (Defence corridor) అందుబాటులోకి రానుండటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ తయారు చేసిన ఫిరంగులు గర్జించడం మొదలు పెడితే.. ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ (Pakistan) దానంతట అదే అదృశ్యమవుతుందని అన్నారు. బుందేల్‌ఖండ్‌ రీజియన్‌లోని బాందాలో నిర్వహించిన కలింజార్‌ మహోత్సవ ప్రారంభ వేడుకల్లో ఆయన మాట్లాడారు. బుందేల్‌ఖండ్‌ రీజియన్‌ను అభివృద్ధి చేసేందుకు బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను నిర్మించినట్లు యోగి ఆదిత్యనాథ్‌ గుర్తు చేశారు. దీంతో చిత్రకూట్‌-దిల్లీ మధ్య ప్రయాణ సమయం 5.30 గంటలకు తగ్గిందని అన్నారు.

చిత్రకూట్‌లో త్వరలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా జరుగుతుందని యోగి ఆదిత్యనాథ్‌  చెప్పారు. రాష్ట్రంలో రక్షణ కారిడార్‌ నిర్మాణం జరుగుతోందన్న ఆయన.. ఇక్కడ తయారు చేసిన ఫిరంగులు గర్జించడం ప్రారంభిస్తే.. పాక్‌ గుండెల్లో వణుకు పుట్టడం ఖాయమని, ప్రపంచ పటం నుంచి ఆ దేశం దానంతట అదే అదృశ్యమవుతుందని అన్నారు. భారత్‌ ఏరోస్పేస్‌, రక్షణ విభాగాల కోసం విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌  కారిడార్‌ (యూపీడీఐసీ)ను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.3,700కోట్లతో ఈ ప్రాజెక్టును 2018 ఆగస్టులో ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని